క్రికెట్లో బ్యాటర్ పలు విధాలుగా అవుట్ అవుతాడు. క్లీన్ బౌల్డ్, క్యాచ్ అవుట్, లెగ్ బీఫోర్(ఎల్బీడబ్ల్యూ), రనౌట్.. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు హిట్ వికెట్గా కూడా అవుట్ అవుతారు. కానీ ఒక రనౌట్ మాత్రం ప్రపంచ క్రికెట్ చరిత్రలో అలా నిలిచిపోయింది. ఇలా కూడా రనౌట్ అవుతారా? అనే సందేహం కలిగేలా.. ఇలా అవుట్ అవ్వాలంటే కేవలం పాకిస్థాన్కు మాత్రం సాధ్యం! అనే రనౌట్ ఒకటి ఉంది. అదే 2007లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ రనౌట్. టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్లో పాకిస్థాన్ను చిత్తు చేసి ఛాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత.. పాకిస్థాన్తో టెస్టు సిరీస్ ఆడింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియంలో నవంబర్ 22న ప్రారంభమైన మ్యాచ్లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.
కానీ.. భారత్ బౌలర్లు చెలరేగి 83 పరుగులకే 5 వికెట్లు కూల్చి పాక్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. కానీ, పాక్ యువ సంచలనం మిస్బా ఉల్ హక్ మాత్రం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. 82 పరుగులపై బ్యాటింగ్ చేస్తూ.. సెంచరీకి చేరువయ్యాడు. మిగతా బ్యాటర్లను పెవిలియన్ చేరుస్తున్న భారత బౌలర్లు మిస్బాను మాత్రం బోల్తా కొట్టించలేకపోతున్నారు. కానీ.. చరిత్రలో నిలిచిపోయే రనౌట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మిస్బా.. భారత బౌలర్లకు చిక్కలేదు. చివరి సౌరవ్ గంగూలీ వేసిన ఇన్నింగ్స్ 95.4 బంతికి పాయింట్ వైపు సింగిల్ కోసం ఆడిన మిస్బా.. ప్రశాంతంగా సింగిల్ పూర్తి చేసేలా కనించాడు.
అయితే.. యువ క్రికెటర్ దినేష్ కార్తీక్ మాత్రం నాన్స్ట్రైకర్ ఎండ్ వైపు గురి చూసి త్రో కొట్టాడు. బౌలర్ గంగూలీ వద్దులే వచ్చేస్తాడు.. అంటూ చేతిలో త్రో కొట్టొద్దని సిగ్నల్ ఇస్తున్నా.. డీకే మాత్రం త్రో కొట్టేశాడు. డీకే విసిరిన బంతికి వచ్చి తనకు ఎక్కడ తగులుతుందో అని.. క్రీజ్కు చేరుకున్న మిస్బా.. బ్యాట్ను క్రీజ్లో పెట్టకుండా.. గాల్లోకి జంప్ చేసి బాల్ను తప్పించుకుని క్రీజ్లోకి దూకుతాడు. కానీ.. ఈ లోపు బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో టీమిండియా క్రికెటర్లు రనౌట్ కోసం అప్పీల్ చేశారు. రిప్లయ్లో చూస్లే.. బంతి వెళ్లి వికెట్లను తాకే సమయంలో మిస్బా లైన్ లోపలే ఉంటాడు కానీ.. గాల్లో ఉంటాడు. దీంతో థర్డ్ అంపైర్ మిస్బాను రనౌట్గా ప్రకటించాడు. ఇలా.. చరిత్రలో నిలిచిపోయేలా మిస్బా మోస్ట్ ఫన్నీగా రనౌట్ అయ్యాడు.