ఐపీఎల్ 2022 సీజన్ నుంచి పోటీలో ఉండబోయే కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తమ లోగోను విడుదల చేసింది. జాతీయ జెండా రంగులతో పక్షి రెక్కలతో లోగోను డిజైన్ చేశారు. మధ్యలో క్రికెట్ బ్యాట్, బాల్ను ఉంచి.. కింద లక్నో సూపర్ జెయింట్స్ అని పేర్కొన్నారు. కాగా లోగోపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు)తో కొనుగోలు చేసింది లక్నో టీమ్. లక్నో జెయింట్స్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. ఆండీ ఫ్లవర్ ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీకి కోచ్గా ఎంపికయ్యాడు. భారత మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీకి మెంటార్గా వ్యవహరిస్తాడు. మరి లక్నో టీమ్ లోగోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Soaring towards greatness. 💪🏼
Lucknow Super Giants is all set to stretch its wings. 🔥
Prepare for greatness! 👊🏼#LucknowSuperGiants #IPL pic.twitter.com/kqmkyZX6Yi— Lucknow Super Giants (@LucknowIPL) January 31, 2022