కోహ్లి కెప్టెన్సీ తొలగింపుపై గత కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తొలగించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త వివాదంగా మారాయి. అయితే కోహ్లి మాట్లాడుతూ.. చెప్పకుండానే తనను కెప్టెన్సీ నుంచి తొలగించారని, ఇక టీ20 కెప్టెన్సీలో కూడా తప్పుకోద్దని ఏ ఒక్కరు కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోహ్లి చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ తోసిపుచ్చడం విశేషం.
అయితే తాజాగా ఇదే అంశంపై లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని కపిల్ దేవ్ అన్నారు. సెలెక్టర్లు కోహ్లి ఆడినంత క్రికెట్ ఆడకపోవచ్చు కానీ.. కెప్టెన్సీ తొలగింపుపై నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం వారికే ఉంటుందని కపిల్ దేవ్ తెలిపారు. ఇది ఒక్క కోహ్లికి మాత్రమే కాదని, మిగతా ఆటగాళ్లందరికీ వర్తిస్తుందంటూ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఇక వీటన్నిటిని విడిచి పెట్టి ఆటపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక తాజాగా కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.