ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్తో పాటు భారత క్రికెట్ జట్టు కూడా ఎంతో మిస్ అవుతున్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. టీమిండియాలో నంబర్ వన్ బౌలర్గా ఉన్న బుమ్రా.. కొన్నేళ్లుగా పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. అయితే.. మూడు నెలల నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీ సందర్భంగా గాయపడిన బుమ్రా.. ఆ తర్వాత పూర్తిగా కోలుకోకుండానే టీమ్లోకి వచ్చి.. మరింత తీవ్రంగా కోలుకున్నాడు. దీంతో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022కు దూరం అయ్యాడు. బుమ్రా టీమ్లో లేకపోవడం టీమిండియా బౌలింగ్ ఎటాక్పై ఎంతటి ప్రభావం చూపించిందో.. వరల్డ్ కప్లో టీమిండియా ప్రదర్శన చూస్తే అర్థమైంది. సూపర్ 12లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్తో నెట్టుకొచ్చిన టీమిండియా.. సెమీస్లో ఇంగ్లండ్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ముందు మన బౌలర్లు తేలిపోయారు.
174 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. దీంతో టీమిండియా బౌలింగ్ ఎటాక్తో పాటు జట్టుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా.. జస్ప్రీత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యాడనే వార్త తెలిసిన తర్వాత.. క్రికెట్ అభిమానులు బుమ్రాపై సైతం విరుచుకుపడ్డారు. కోట్లు కురిపించే ఐపీఎల్లో నిర్విరామంగా రెండు నెలల పాటు 14 నుంచి 16 మ్యాచ్లు ఆడుతుంటే కానీ.. గాయాలు..టీమిండియాకు ఆడుతుంటేనే అవుతున్నాయా? అంటూ బుమ్రాపై ట్రోలింగ్కు దిగారు. అభిమానుల కోపానికి బుమ్రా గత రికార్డులు కూడా కారణంగా అయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన తర్వాత బుమ్రా టీమిండియా కంటే.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్కే ఎక్కువగా ఆడాడు.
టీ20 వరల్డ్ కప్కు దూరమైన సమయంలో బుమ్రాకు సంబంధించిన గత రికార్డులు, ఆడిన మ్యాచ్ల లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానుల కోసం మరింత ఎక్కువైంది. బుమ్రాను మిస్టర్ ఐపీఎల్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఆ సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం బుమ్రా గాయం నుంచి కోలుకుని.. నెట్స్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం టీమిండియాకు శుభసూచకమనే చెప్పాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్తో తొలి టెస్టు ఆడుతున్న టీమిండియా.. మరో టెస్ట్ ఆడి.. స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ తర్వాత.. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. టెస్టు వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాలంటే.. ఆ నాలుగు టెస్టుల్లో టీమిండియా మూడు టెస్టులను కచ్చితంగా గెలవాలి. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వడం టీమిండియాకు ఎంతో ప్లస్ అవుతుంది. మరీ.. బుమ్రా ఆసీస్తో టెస్టు సిరీస్ వరకు పూర్తిగా కోలుకుని వస్తాడని క్రికెట్ అభిమానులు సైతం ఆశిస్తున్నారు. అయితే మరికొంతమంది బుమ్రా ఐపీఎల్ కోసం రెడీ అవుతున్నట్లు కామెంట్ చేస్తున్నారు. మరి బుమ్రా గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit bumrah ready for the home series and IPL pic.twitter.com/glUQpFPu0O
— Sonu Jha (@cricloversonu) December 16, 2022