వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా-2022లో వన్డే, టీ20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మూడో టీ20 మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే 18వ ఓవర్లో ఫస్ట్ బాల్ గురించి. అదే మ్యాచ్ టర్నింగ్ కూడా అదే. నికోలస్ పూరన్ విజృభిస్తున్నాడు. మ్యాచ్ మొత్తం వెస్టిండీస్ వైపునకు తిరుగుతోందని భారత్ అభిమానులు భయంగా ఉన్నారు.
ఆ సమయంలో.. బాల్ శార్దూల్ ఠాకూర్ తీసుకున్నాడు. 18వ ఓవర్ ఫస్ట్ బాల్ వేయగా పూరన్ ఆ బంతిని భారీ షాట్ కొట్టాడు. కానీ, ఆ బంతి ఎడ్జ్ తీసుకుని బాగా గాల్లోకి లేచింది. ఆ క్యాచ్ కోసం కీపర్ ఇషాన్ కిషన్ పరుగులు పెట్టాడు. అమాంతం గాల్లోకి లేచి ఆ క్యాచ్ అందుకున్నాడు. అంత అద్భుత క్యాచ్ పట్టుకున్న విషయాన్ని చాలా మంది గుర్తించలేదు. కానీ, హైలెట్స్ లో మాత్రం రిపీట్ మోడ్ లో చూస్తూ.. ఇషాన్ కిషన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.రెండో ట్వీ20లోనూ పూరన్ బంతిని గాల్లోకి లేపగా.. భువనేశ్వర్ దానికి అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, మంచు వల్ల ఆ బంతి చేతిలో బౌన్స్ అయ్యింది. ఈసారి మాత్రం ఆ తప్పు రిపీట్ కాకుండా అందరూ కీపర్ నే క్యాచ్ తీసుకోవాలని కోరారు. ఇషాన్ కిషన్ కూడా ఎంతో నేర్పుగా ఆ క్యాచ్ ను పట్టుకున్నాడు. 18 బంతుల్లో 37 పరుగులు సాధించాల్సిన సమయంలో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్న పూరన్ క్యాచ్ వదిలేసుంటే మాత్రం.. మ్యాచ్ మొత్తం రివర్స్ అయ్యేది అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. మరి, ఆ అద్భుత క్యాచ్ ను మీరూ ఓసారి చూసేయండి.
#INDvWI pic.twitter.com/Nmjcc2tjPs
— K I N G (@KingPaONEkalyan) February 21, 2022