ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన తొలి టీ 20 లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఐర్లాండ్ పేలవ ఫీల్డింగ్ భారత్ కి అదృష్టంగా మారింది.
వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం చాలా ముఖ్యం. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు ప్రత్యర్థి బౌలర్లకి చిరాకు కలిగేలా చేయొచ్చు. కానీ ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపు వేగంగా పరిగెడితే దానిని ఏమనాలి. వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. క్రికెట్ లో ఇలాంటివి జరగడం ఇప్పటికే మనం చాలా సార్లు చూసే ఉంటాం. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి అరుదైన సంఘటన నిన్న జరిగిన టీ 20మ్యాచులో కూడా జరిగింది. టీమిండియా ఓపెనర్లు గైక్వాడ్-జైస్వాల్ సమన్వయ లోపం కారణంగా క్లియర్ గా రనౌట్ అవకాశం ఉన్నా.. ఐర్లాండ్ పేలవ ఫీల్డింగ్ భారత్ కి అదృష్టంగా మారింది. మరి ఈ రనౌట్ ఎలా జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఐర్లాండ్ తో టీ 20 సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన తొలి టీ 20 టీమిండియాకు విజయం దక్కింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచులో డక్త్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో టీమిండియా ఓపెనర్లు తొలి ఓవర్లోనే 10 పరుగులు రాబట్టి మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే జోషువా లిటిల్ వేసిన ఇన్నింగ్స్ రెండు ఓవర్లో మూడో బంతి.. జైస్వాల్ థైప్యాడ్కు తాకి షార్ట్ ఫైన్లెగ్ వైపు వెళ్లింది. దాంతో.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న రుతురాజ్ పరుగు కోసం కాల్ ఇచ్చాడు. దీంతో జైస్వాల్ కూడా పరుగు తీసేందుకు ముందుకు వెళ్ళాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడం చూసిన గైక్వాడ్ వెనక్కి వచ్చేసాడు.
మరోవైపు జైస్వాల్ కూడా అప్పటికే పరుగు పూర్తి చేయడంతో ఇద్దరూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కి వచ్చేసారు. అయితే బౌలర్ ఎండ్ దగ్గర ఎవరూ లేకపోవడంతో నౌట్ మిస్ అయింది. దీంతో రుతురాజ్ మళ్లీ పరిగెత్తి.. స్టైకింగ్ ఎండ్ వైపు డైవ్ చేస్తూ.. రన్ పూర్తి చేశాడు. అప్పటికీ రుతురాజ్ను అవుట్ చేసే ఛాన్స్ ఉన్నా.. ఐర్లాండ్ ఆటగాళ్లు అవుట్ చేయడంలో విఫలం అయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. కర్టిస్ కాంఫర్(39), బారీ మెక్కార్టీ(51) పోరాటంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఇక 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వర్షం పడే సమయానికి 2 వికెట్లకి 6.5ఓవర్లలో 47 పరుగులు చేసింది. డక్త్వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా అదనంగా 2 పరుగులు ఎక్కువ స్కోర్ చేయడంతో భారత్ ని విజేతగా ప్రకటించారు. మొత్తానికి సింపుల్ గా రనౌట్ అవకాశాన్ని మిస్ చేసిన ఐర్లాండ్ ఫీల్డింగ్ కాస్త నవ్వు తెప్పించింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
— Hitler Mishra (@HitlerMish5814) August 18, 2023