టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో 200 క్యాచ్ల మైలు రాయి అందుకున్నాడు. ప్రిటోరియస్ బౌలింగ్లో డేంజరస్ క్వింటన్ డికాక్ ఇచ్చిన క్యాచ్ను అందుకున్న ధోనీ టీ20 క్రికెట్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్గా ధోనీ రికార్డులకెక్కాడు. వికెట్ కీపర్గా అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని రికార్డులు సాధించిన ధోని.. ఇప్పుడు ఐపీఎల్ కెరీర్ చివరి దశలో కూడా రికార్డుల మోతమోగిస్తున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్పై హాఫ్ సెంచరీ చేసిన ధోని.. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్లోనూ 6 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
అలాగే ఈ మ్యాచ్తో టీ 20ల్లో 7వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ వికెట్ కీపర్గా, ఓవరాల్గా ఆరో టీమిండియా క్రికెటర్గా నిలిచాడు. ధోని కంటే ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప మాత్రమే టీ20ల్లో 7వేలకు పైగా పరుగులు సాధించారు. కాగా ఇప్పటివరకు మొత్తం 349 టీ20 మ్యాచ్లు ఆడిన ధోని 7వేల పరుగులు మార్కును అధిగమించాడు. కాగా టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను టీ20ల్లో మొత్తం 14,562 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో పాక్ కు చెందిన షోయబ్ మాలిక్ రెండు, కీరన్ పొలార్డ్ మూడు, ఆరోన్ ఫించ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ఇదీ చదవండి: బేబీ డివిలియర్స్ బదోని టాలెంట్ను ద్రవిడ్ గుర్తించినా.. వాళ్లు పట్టించుకోలేదు
Yesterday Dhoni completed 200 T20 catches
One of the best Wicket keeper batsman of T20 cricket 🙂🔥 pic.twitter.com/AadQCWgVO5— Irfan🇮🇳🦁💛💜💗 (@imMSDVK718) April 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.