పాకిస్థాన్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో మిథాలీ సేన 107 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ గెలుపు కంటే కూడా మ్యాచ్ అనంతరం భారత అమ్మాయిలు చేసిన పనే ఇప్పుడు విశేషంగా మారింది. ఐసీసీతో పాటు అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత అమ్మాయిలు చేసిన పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం విజయానందాన్ని భారత అమ్మాయిలు పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా మారుఫ్ కూతురితో పంచుకున్నారు.
This video ..
🇮🇳🙌🏻🇵🇰#INDvPAK #INDvSL #PAKvIND #PAKvAUS#CWC22 #Peshawarblast pic.twitter.com/VuoCOGyzKW
— DhrubaJyot Nath 🇮🇳 (@Dhrubayogi) March 6, 2022
తన కూతురు ఫాతిమాను తీసుకుని మారుఫ్ ప్రపంచకప్ ఆడేందుకు వచ్చింది. ఓ వైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు కెప్టెన్గా మైదానంలో జట్టును నడిపిస్తున్న మారూఫ్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పాకిస్థాన్పై విజయం తర్వాత భారత అమ్మాయిలందరూ ఆ చిన్నారితో ఆడుకున్నారు. ఆ చిన్నారి ముఖాన్ని చూస్తూ నవ్వులు చిందించారు. ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తల్లీకూతుళ్లతో టీమిండియా క్రికెటర్లు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత్, పాక్ జట్లను చూసి క్రికెట్ స్ఫూర్తిని నేర్చుకోవడమే ఫాతిమా మొదటి పాఠమంటూ ఈ ఫొటోను ఐసీసీ ట్వీట్ చేసింది. అభిమానులు కూడా భారత అమ్మాయిలను కొనియాడుతున్నారు. మరి టీమిండియా ప్లేయర్స్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Little Fatima’s first lesson in the spirit of cricket from India and Pakistan 💙💚 #CWC22
📸 @TheRealPCB pic.twitter.com/ut2lCrGL1H
— ICC (@ICC) March 6, 2022