2023లో జరగనున్న ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి భారత జట్టు అర్హత సాధించింది. ఆసియా కప్ 2023 గ్రూప్ డీ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిలిప్పిన్స్ పై పాలస్తీనా విజయం సాధించడంతో భారత్ కి మార్గం సుగమమైంది. దీంతో ఈ టోర్నీలో హంగ్కాంగ్ తో జరిగే మ్యాచ్ కంటే ముందే భారత ఫుట్బాల్ జట్టు.. 2023 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడం విశేషంగా మారింది.
ఇక హంగ్కాంగ్ తో జరగబోయే మ్యాచ్ లో భారత్ జట్టు ఓడిపోయినా.. గ్రూప్ డిలో 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలుస్తుంది. ఈ విధంగా భారత్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా కప్ కు అర్హత సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. కోల్కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతున్న ‘ఆసియా కప్ 2023’ గ్రూప్ డీ క్వాలిఫైయర్స్ లో భారత జట్టు కొలంబియాను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో 2-1 తేడాతో గెలిచి టాప్-2 స్థానంలోకి చేరుకుంది.
ఇదిలా ఉండగా.. 1956లో ఆసియా కప్ ఆరంభమైనప్పటి నుండి భారత్ ఇప్పటివరకూ ఐదుసార్లు మాత్రమే టోర్నీకి అర్హత సాధించడం గమనార్హం. మొదటిసారి 1964లో.. ఫైనల్ చేరిన భారత్.. ఇజ్రాయిల్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 1984లో స్టేజి వరకే పరిమితం కాగా.. 2011లో 16వ స్థానంలో.. 2019లో 17వ స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు 2023 సీజన్ కు అర్హత సాధించి పోటీపడనుంది. వచ్చే ఏడాది జూన్ 16 నుంచి జులై 16 వరకు చైనాలో ఆసియా కప్ -2023 జరగనుంది. మరి భారత్ అర్హత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
🥳 HERE WE COME 🥳
As Palestine 🇵🇸 defeat Philippines 🇵🇭 in Group 🅱️, the #BlueTigers 🐯 🇮🇳 have now secured back-to-back qualifications for the @afcasiancup 🤩#ACQ2023 🏆 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/3aNjymWLSm
— Indian Football Team (@IndianFootball) June 14, 2022