మూడు టెస్టుల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల భారత క్రికెట్ చరిత్రలో సెంచూరియన్ మైదానంలో భారత్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ గ్రౌండ్లో సౌతాఫ్రికాకు తిరుగులేదు. కేవలం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఈ గ్రౌండ్లో ప్రొటీస్ జట్టును ఒక్కొసారి ఓడించాయి. ఇప్పుడు భారత్ కూడా ఇక్కడ తొలివిజయం నమోదు చేసి సౌతాఫ్రికా గడ్డపై వారిని ఓడించింది.
కాగా ఈ నెల 26 ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రారంభం అందించారు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. మూడో రోజు భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 197 పరుగులకే కుప్పకూలింది. ఇక మొదటి ఇన్నింగ్స్తో ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయి సౌతాఫ్రికాతకు 305 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.దీన్ని ఛేదించే క్రమంలో ఫ్రొటీస్ జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ జట్టు అద్భుత విజయాన్ని తమ పేరిట లిఖించుకుంది. ఈ విజయంలో భారత బౌలర్ల పాత్ర కీలకం. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమి ఐదు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 5, సిరాజ్ 3, అశ్విన్ 2, ఠాకుర్ 2 వికెట్లు తీసుకున్నారు. మరి టీమిండియా సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.