దేశంలో క్రికెట్ కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని మతాల్లానే.. క్రికెట్ కూడా ఒక మతంలా మారిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఇంత ఆదరణ ఉండేది కాదు. ఆ సంఖ్య వేలల్లోనే ఉండేది. అందులోనూ అప్పట్లో భారత జట్టు రాణించిన సందర్భాలు చాలా తక్కువ. పేరుకు గొప్ప గొప్ప ఆటగాళ్లు జట్టులో ఉన్నా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి మేటి జట్లకు తలొంచడం తరచూ చూసేవాళ్లు అభిమానులు. అప్పుడప్పుడూ అగ్రశ్రేణి జట్ల పేస్ బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ వచ్చే మెరుపు ఇన్నింగ్స్ లు, అడపాదడపా వచ్చే గెలుపులే మహాభాగ్యంగా భావించేవాళ్లు. కానీ కాలం గడిచేకొద్దీ క్రికెట్లో టీమిండియా నైపుణ్యం పెరిగింది. మేటి ఆటగాళ్ల రాకతో క్రికెట్ పై క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా కపిల్ డెవిల్స్ 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగి వరల్డ్ కప్ కొట్టడం.. దేశ యువతపై చెరగని ముద్ర వేసింది. ఆనాటి నుంచి దేశంలో క్రికెట్ కు ఆదరణ పెరుగుతూనే ఉంది.
గడిచిన రెండేళ్లగా కోవిడ్ వల్ల ప్రేక్షకులు లేక వెలవెలబోయిన స్టేడియాలు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఇరు జట్ల మధ్య జూన్ 12న జరుగనున్న రెండో టీ20 కోసం ఒడిషా క్రికెట్ అసోసియేషన్ (ఒసీఎ) టికెట్ల విక్రయాన్ని ప్రారంభించగా.. తొక్కిసలాట చోటు చేసుకుంది. 45వేల సీటింగ్ కెపాజిటీ ఉన్న బారాబతి స్టేడియంలో.. ఆన్లైన్, స్కూల్స్, ఇతరులకు 33వేల టిక్కెట్లు పోగా.. మిగిలిన 12వేల టికెట్లను విక్రయించేందుకు ఒసీఎ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే మ్యాచ్ కు సమయం దగ్గరపడుతుండటంతో గురువారం స్టేడియం ముందు భారీ ఎత్తున జనం గుమిగూడారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు కేటాయించినప్పటకీ పోలీసులు కట్టడి చేయలేకపోయారు.
Uncontrollable queue of women for #2ndT20 tickets at #BarabatiStadium Cuttack. Long queue in extreme heat time. Violence erupted between women while standing in long time queues. Will these women watch the match? #INDvSA pic.twitter.com/m6rIoWhLuZ
— AJIT SAHANI (@2008Sahani) June 9, 2022
ఇది కూడా చదవండి: Avesh Khan: అవేష్ ఖాన్ ఆవేశానికి..రెండు ముక్కలైన డుస్సెన్ బ్యాట్! వీడియో వైరల్!
ఉదయం ఆరు గంటల నుంచే క్యూలలో జనసందోహం కనబడింది. ఉదయం 9 అవుతుండగా మహిళల లైన్లలోకి కొంతమంది లైన్ లో నిల్చోకుండానే టికెట్ తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వెనకాల ఉన్న మహిళలు.. వారితో వాగ్వాదానికి దిగారు. ‘మేం ఆరింటికి వచ్చి లైన్లలో నిల్చున్నాం కదా.. ఇప్పుడొచ్చి నువ్వు లోపలికి ఎలా వెళ్తావ్..?’అంటూ గొడవకు దిగారు. చిన్నగా మొదలైన ఈ గొడవ చినికి చినికి గాలివాన అయింది. చివరకి జుట్లు పట్టుకుని కొట్టుకోవడం.. లైన్లలోంచి తోసేయడం.. ఒకరిమీద ఒకరు పడి కొట్టుకోవడం దాకా వెళ్ళింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి యత్నించినా అదీ కుదరలేదు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
It looks funny but that’s what it is. Craze of cricket in india is much more high than any thing. Visuals from the “Barabati stadium ” Cuttack, where 2nd T20 is to be played between India vs SouthAfrica. pic.twitter.com/Yn7R2MWQNj
— sagar kumar swain (@sagarkumar1041) June 9, 2022
[VIDEO] #WATCH Stampede-like situation outside Barabati stadium in Cuttack as scuffle breaks out between fans at the offline ticket counters; Police resort to lathi-charge to control the crowd #IndvsSA #Odisha pic.twitter.com/EzV5wGf3e6
— OTV (@otvnews) June 9, 2022
ఇది కూడా చదవండి: IND vs SA T20 Series: తాగాల్సింది బీర్లు కాదు.. వాటర్! ఆటగాళ్లకు కెప్టెన్ సలహా!
ఢిల్లీ, అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన తొలి టీ20 లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జూన్ 12 (ఆదివారం)న కటక్ లో రెండో టీ20 జరగాల్సి ఉంది. ఇందులో విజయం సాధించి సిరీస్ ను 1-1 తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఆదరణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨IND vs SA 2nd T20 (BARABATI STADIUM) #INDvSA #INDvsSA #2NDT20 #RishabhPant pic.twitter.com/C0DCdunlTV
— Mr Cricket Funda (@MrCricketfunda1) June 10, 2022
📣David Miller and Rassie van der Dussen script history for South Africa.
📸: Disney+Hotstar#IshanKishan #CricTracker #INDvSA #T20Is #Cricket #RishabhPant #HardikPandya #DavidMiller #RassievanderDussen pic.twitter.com/Rlio5JZAJU
— CricTracker (@Cricketracker) June 9, 2022