నేపియర్ వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మూడవ టీ20 మ్యాచ్ టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 161 పరుగుల లక్ష్యం నిర్ధేశించగా, అనంతరం బరిలోకి దిగిన ఇండియా 9 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అయితే ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను నిలిపేశారు. అయితే ఈ వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం స్కోర్లు సమంగా ఉన్నందున మ్యాచ్ను టైగా ప్రకటించారు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(59), ఫిలిప్స్(54) హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్కు గౌరవ ప్రదమైన స్కోర్ను అందించారు. నిజానికి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కివీస్ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. ఇక చివర్లో పరుగులు రాబట్టే ప్రయత్నంలో న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. 30 పరుగుల తేడాతో 8 వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. భారత బౌలర్లలో హర్షదీప్, సిరాజ్లు నాలుగేసి వికెట్లు తీసుకున్నారు.
That’s the end of today’s play.
🇮🇳 take the series but they would have loved to have a full game. 🙄#PlayBold #TeamIndia #NZvIND pic.twitter.com/Y3FjbT1Qbu
— Royal Challengers Bangalore (@RCBTweets) November 22, 2022
అనంతరం 161 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 60 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్(10), రిషబ్ పంత్(11), శ్రేయస్ అయ్యర్(0), సూర్యకుమార్ యాదవ్(13)లు వెంటవెంటనే ఔటయ్యారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా(30), దీపక్ హుడా(9)తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 9 ఓవర్లు ముగిసేసరికి 75/4 ఉన్నప్పుడు వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ను నిలిపేశారు. అయితే ఈ వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం స్కోర్లు సమంగా ఉన్నందున మ్యాచ్ను టైగా ప్రకటించారు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా నవంబర్ 25న తొలి వన్డే జరగనుంది.
Mohammed Siraj is adjudged Player of the Match for his brilliant bowling figures of 4/17 as the final T20I ends in a tie on DLS.
Scorecard – https://t.co/rUlivZ308H #NZvIND pic.twitter.com/kSHPp8wFTx
— BCCI (@BCCI) November 22, 2022