బ్యాటింగ్లో ఓపెనర్లు చెలరేగి ఆడగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీకితోడు వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్తో న్యూజిలాండ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ పెట్టినా.. యువ సంచలన ఉమ్రాన్ మాలిక్ రాణించినా.. మిగతా బౌలర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ను 1-0తో కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్ను ఓటమితో ప్రారంభించింది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ చేసినా.. మ్యాచ్ గెలవలేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియాకి ప్రధానంగా ఐదు కారణాలు చెప్పుకొవచ్చు.
1. పంత్, సూర్యకుమార్ యాదవ్..
ఓపెనర్లు శిఖర్ ధావన్-శుబ్మన్ గిల్ టీమిండియాకు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్కు 124 పరుగుల భారీ భాగస్వామ్యం అందించి.. అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. కానీ.. 50 పరుగుల మార్క్ చేరుకున్న తర్వాత శుబ్మన్ గిల్ అవుట్ అవ్వడం.. ఆ మరుసటి ఓవర్లోనే 72 పరుగులు చేసి ధావన్ సైతం అవుట్ అవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ బాగానే ఆడుతున్నా.. మరో ఎండ్లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ నిలబడలేకపోవడంతో.. టీమిండియాకు రావాల్సిన స్కోర్ కంటే ఇంకా తక్కువగానే వచ్చిందనే చెప్పాలి. కానీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రిషభ్ పంత్(15), ఐదోస్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(4) వెంటవెంటనే అవుట్ అవ్వడంతో.. టీమిండియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక్కడి నుంచి వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్, ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజు శాంసన్తో కలిసి.. భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
2. శిఖర్ ధావన్ కెప్టెన్సీ..
గతంలో తన కెప్టెన్సీలో పలు సిరీస్ విజయాలు అందించిన శిఖర్ ధావన్పై ఈ సిరీస్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. బ్యాటింగ్లో రాణించిన ధావన్.. కెప్టెన్గా బౌలర్లను ప్రయోగించడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. ఉమ్రాన్ మాలిక్తో ఆరంభంలోనే కొత్త బంతితో బౌలింగ్ చేయించకుండా.. 11వ ఓవర్లో తెచ్చాడు. అయినా కూడా ఉమ్రాన్ మాలిక్ తన వంతు ప్రయత్నం చేసినా.. మిగతా బౌలర్లు విఫలం అయ్యారు. కానీ.. ఉమ్రాన్తో స్టార్టింగ్ ఓవర్స్ చేయించి ఉంటే.. ఫలితం ఉండేదని.. మరిన్ని వికెట్లు త్వరగా పడేవని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
3. అర్షదీప్ సింగ్ వైఫల్యం..
భారీ అంచనాలు పెట్టుకున్న అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలం అయ్యాడు. 8.1 ఓవర్ వేసిన అర్షదీప్ ఏకంగా 68 పరుగులు సమర్పించుకుని ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పైగా అర్షదీప్కు ఇదే తొలి వన్డే మ్యాచ్. ఉమ్రాన్ మాలిక్తో కలిసి వన్డే ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన అర్షదీప్ సింగ్.. అంచనాలను అందుకోలేకపోయాడు. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణించిన అర్షదీప్.. ఈమ్యాచ్లో నిరాశపరిచాడు. ఆరంభంలోనే భారీగా పరుగులు ఇచ్చుకుని.. కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయాడు.
4. స్పిన్నర్లు..
వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. వికెట్లు తీయలేకపోయాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ అయితే.. పూర్తిగా తేలిపోయాడు. 10 ఓవర్ల కోటా పూర్తి చేసి 67 పరుగులు సమర్పించుకని ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. చాహల్ బౌలింగ్ను కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ చాలా సులువుగా ఎదుర్కొని ఈజీగా పరుగులు పిండుకున్నారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కాస్త ప్రభావం చూసి.. ఒకటి రెండు వికెట్లు తీసి ఉంటే.. కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
5. చెత్త ఫీల్డింగ్..
ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ స్థాయి తగ్గట్లు లేదు. చాలా మిస్ ఫీల్డ్స్తో పాటు పలు క్యాచ్లను కూడా వదిలేశారు. కేన్ విలియమ్సన్ బ్యాటింగ్కు వచ్చిన కొద్ది సేపటికే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే బ్యాట్కు ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ పక్కగా వెళ్లింది. కానీ.. పంత్ ఆ క్యాచ్ కోసం ప్రయత్నించలేదు. శార్దుల్ ఠాకూర్ కూడా పూర్ ఫీల్డింగ్తో నిరాశపరిచాడు. మొత్తానికి ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో మంచి స్కోర్ చేసినా.. బౌలింగ్లో విఫలమై ఓటమి చవిచూసింది.
Congratulations @BLACKCAPS
Calm & composed innings by #Williamson & #lathamGood efforts by @umran_malik_01
Hardluck #TeamIndia
Comeback more stronger in next game#INDvsNZ pic.twitter.com/oObJ7yHmcb— Munaf Patel (@munafpa99881129) November 25, 2022