సౌతాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్కు ముందు ఈ సిరీస్ టీమిండియా ఎంతో కీలకం. స్ట్రాంగ్ టీమ్ అయిన సౌతాఫ్రికాపై గెలిచి వరల్డ్ కప్కు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని టీమిండియా భావిస్తుంది. అందుకు తగ్గట్లే మూడు టీ20 మ్యాచ్లో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికాను కేవలం 106 పరుగులకే కట్టడి చేసి అదరగొట్టింది. కానీ.. బ్యాటింగ్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా టాపార్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ప్రొటీస్ స్టార్ పేసర్ కగిసో రబడాను ఎదుర్కొలేక చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే టీమిండియా అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
టీ20 ఫార్మాట్లోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన ఘోరమైన రికార్డును టీమిండియా తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా పేసర్ రబాడా ధాటికి పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ భారత స్టార్ బ్యాటర్లు.. 6 ఓవర్ల పవర్ప్లేలో కేవలం 17 పరుగులు మాత్రమే చేశారు. పోనీ వికెట్లు ఏమైనా వెంటవెంటనే ఎక్కువగా పడ్డాయా అంటే అదీ లేదు. కేవలం కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ మాత్రమే కోల్పోయి.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉండి కూడా పవర్ప్లేలో అత్యంత తక్కువ పరుగులు చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ప్రపంచ క్రికెట్లోనే అంతర్జాతీయ టీ20లో పవర్ప్లే ముగిసిన తర్వాత ఇంత తక్కువ పరుగులు చేసిన తొలి జట్టు టీమిండియానే. గతంలో 2016లో పాకిస్థాన్తో మ్యాచ్లో టీమిండియా పవర్ప్లేలో 26 పరుగులు చేసిన చెత్త రికార్డును బద్దలుకొట్టుకుని కొత్త చెత్త రికార్డును నమోదు చేసింది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. నిజానికి 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ప్రొటీస్ జట్టు 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ.. కేశవ్ మహారాజ్(41) రాణించడం, మార్కరమ్(25), పార్నెల్(24) పర్వాలేదనిపించడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఊదేస్తుందని భావిస్తే.. సౌతాఫ్రికా పేసర్లు అంత ఈజీగా లొంగలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(0), విరాట్ కోహ్లీ(3) త్వరగానే అవుట్ చేసిన రబాడా టీమిండియాలో గుబులుపెంచాడు. కానీ.. నిదానంగా ఆడిన కేఎల్ రాహుల్(51 నాటౌట్), ఎదురుదాటికి దిగిన సూర్యకుమార్ యాదవ్(50) 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి టీమిండయా 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు.
#TeamIndia lose one wicket in the powerplay with 17 runs on the board.
Live – https://t.co/L93S9k4QqD #INDvSA @mastercardindia pic.twitter.com/jfBdlUZYuy
— BCCI (@BCCI) September 28, 2022
Lowest powerplay score for India in T20Is- 17 runs.
— India Fantasy (@india_fantasy) September 28, 2022
ఇది కూడా చదవండి: విమర్శకులకు బాల్ తోనే సమాధానం చెప్పిన అర్షదీప్.. ఒకే ఓవర్ లో 3 కీలక వికెట్లు!