టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ దుమ్మురేపాడు. లంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. జడ్డూ దెబ్బకు శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు భారీ ఆధిక్యం లభించింది. దీంతో లంక ఫాలో ఆన్ ఆడడం అనివార్యమైంది. ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్ లోను శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.
మొదటి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జడేజా 175(17 ఫోర్లు,3 సిక్సుర్లు) పరుగులతో మెరిశాడు. తరువాత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నిస్సంక (61*) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. జడేజా ఐదు వికెట్లు తీశాడు. ఫలితంగా లంక 400పరుగుల వెనుకంజలో ఉంది. కాగా, శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యాక.. టీమ్ఇండియా ఫాలో- ఆన్ ఇచ్చింది. దీంతో శ్రీలంక జట్టే మళ్లీ బ్యాటింగ్కు దిగింది.
400 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అశ్విన్ బౌలింగ్లో తిరిమన్నే డకౌట్గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న పాతుమ్ నిస్సంకా రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే(27) పరుగులు చేసి షమీ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక 45 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. మాథ్యూస్ 17, ధనంజయ డిసిల్వా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా.. విజయానికి మరో ఏడు వికెట్ల దూరంలో ఉంది.
ICYMI: From hunger for big tons to some Pushpa celebrations 🔥 👍
After his superb 175* in the 1st @Paytm #INDvSL Test, @imjadeja chats with @mayankcricket about his batting mindset & more. 👌 – By @Moulinparikh
Full interview 🔽 https://t.co/8wKNw3KLUG pic.twitter.com/0N32WcGVl8
— BCCI (@BCCI) March 6, 2022