క్రికెట్ మ్యాచ్ జరిగే సమయంలో అప్పుడప్పుడు ప్రకృతి ఆటంకం కలిగిస్తుండటం సహజం. వర్షం రావడం, లైట్ పోవడం, పొగ మంచు అధికంగా ఉండటం మనం తరుచూ చూస్తూనే ఉంటాము. కానీ.., క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఏకంగా భూకంపమే వస్తే..? వినడానికే విచిత్రంగా ఉంది కదా? ఈ ఆశ్చర్యకర ఘటన వెస్టిండీస్ లో జరుగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ సమయంలో ఇది చోటుచేసుకుంది.
అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా ప్లే ఆఫ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఐర్లాండ్, జింబాబ్వే మధ్య శనివారం జరిగింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తుండగా భూకంపం సంభవించింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈ ఘటన వచ్చింది. ఆటగాళ్లకు విషయం తెలియక ఆటను అలానే కొనసాగించారు. కానీ 20 సెకన్ల నిడివి గల భూకంపం ఘటన కెమెరాకు చిక్కింది.
రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ సముద్ర తీరంలో ఏర్పడ్డ ఈ భూకంపం కారణంగా మ్యాచ్ జరుగుతున్న క్వీన్స్ పార్క్ ఓవల్ లోనూ స్వల్ప ప్రకంపనాలు వచ్చాయి. ” భూకంపం వచ్చినప్పడు.. మా వెనకాల రైళ్లు వెళ్తున్న దానికంటే ఎక్కువ ప్రకంపనాలే వచ్చాయి.. దీని వల్ల మైదానంలోని మీడియా సెంటర్ వణికింది” అని ఆ సమయంలో కామెంటరీగా ఉన్న ఆండ్రూ పేర్కొన్నాడు. అయితే, ఆటగాళ్లు దీనిని గుర్తించలేకపోవడం విశేషం.
Earthquake at Queen’s Park Oval during U19 World Cup match between @cricketireland and @ZimCricketv! Ground shook for approximately 20 seconds during sixth over of play. @CricketBadge and @NikUttam just roll with it like a duck to water! pic.twitter.com/kiWCzhewro
— Peter Della Penna (@PeterDellaPenna) January 29, 2022