దీపక్ హుడా టీ20ల్లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఘనత సాధించాడు. మంగళవారం ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో హుడా 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 104 పరుగులు చేశాడు. దీంతో సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్రాహుల్ తర్వాత టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో హుడా టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా మారాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో వివాదాలతో ఫేమస్ అయిన హుడా ఇప్పుడు తన ఆటతో గుర్తింపు సంపాదిస్తున్నాడు. 2017లోనే టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన హుడాకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ సమయంలో తాను చాలా నిరాశలో ముగిపోయినట్లు ఒక విధంగా డిప్రెషన్లోకి కూడా వెళ్లాడు. ఆ పరిస్థితుల్లో తనకు పఠాన్ బ్రదర్స్ అయిన ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ అండగా నిలిచినట్లు హుడా అనేక సందర్భాల్లో తెలిపాడు. దేశవాళీ క్రికెట్లో పఠాన్ బ్రదర్స్తో పాటు హుడా కూడా బరోడా జట్టుకు ఆడేవాడు.
పఠాన్ బ్రదర్స్ గురించి హుడా మాట్లాడుతూ..‘ టీమిండియా తుది జట్టులో నాకే ఎందుకు చోటు దక్కడంలేదని, నేను ఇర్ఫాన్ పఠాన్ ఎదుట నా ఆవేదనను వెళ్లడించినప్పుడు.. ఇర్ఫాన్ భాయ్ నాతో ఇలా అన్నారు.. ఓపిక, సహనంతో ఉండూ.. మన టైమ్ వస్తుందని చెప్పారు. ఆ మాట నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అలాగే కామ్గా ఉండూ ప్రిపరేషన్, హార్డ్వర్క్, ప్రాసెస్పై ఫోకస్పెట్టాలని పఠాన్ బ్రదర్స్ సలహా ఇచ్చారు. వారి సలహాలను పాటించి ఐపీఎల్లో పంజాబ్ తరపున రాణించాను. పఠాన్ బ్రదర్స్ నా కెరీర్కు అందించిన సహకారం మరువలేనిది.’ అంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత 2021లో అప్పటి బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాతో వివాదం కారణంగా హుడా బరోడా జట్టును వీడుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముం హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు.
‘ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ పాండ్యా దూషిస్తున్నాడు. తాను ఒక సీనియర్ ఆటగాడినేనని.. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్ కెప్టెన్ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్ దానిని స్వీకరించడం లేదు. పైగా జట్టు సహచరుల ముందే నన్ను దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నో జట్లకు ఆడాను.. ఒక ఆటగాడిగా చాలా మంది కెప్టెన్సీలో పనిచేశాను.. కానీ కృనాల్ పాండ్యా తరహా వేధింపులు ఎక్కడా ఎదుర్కోలేదు. కేవలం కృనాల్ బ్యాడ్ బిహేవియర్ కారణంగానే టీమ్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోయానంటూ ‘ దీపక్ హుడా ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఈ వివాదంపై బరోడా క్రికెట్ అసోసియేషన్ విచారణ కూడా జరిపింది. ఇద్దరిని మందలించింది. ఆ తర్వాత ఇద్దరూ ఐపీఎల్ 2022లో ఒకే జట్టు కూడా ఆడారు. లక్నో సూపర్జెయింట్స్ తరపున ఆడిన కృనాల్, దీపక్ వివాదాలు పక్కనపెట్టి జట్టు కోసం ఒక్కటయ్యారు. ఇప్పుడు కృనాల్ పాండ్యా తమ్ముడు హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలోనే దీపక్ హుడా టీమిండియాకు ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇలా పఠాన్ బ్రదర్స్తో పాటు, పాండ్యా బ్రదర్స్ హుడా కెరీర్ను ప్రభావితం చేశారు. మరి హుడా కెరీర్లో వివాదాలు, పఠాన్ బ్రదర్స్ అండ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2⃣ Matches
1⃣5⃣1⃣ Runs@HoodaOnFire put on a stunning show with the bat & bagged the Player of the Series award as #TeamIndia completed a cleansweep in the 2-match T20I series against Ireland. 👍 👍 #IREvIND pic.twitter.com/UuBKCx1HNj— BCCI (@BCCI) June 28, 2022