సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా అభిమానిస్తుంటారు. సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్ లకు కూడా ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళని కలవాల్సిన టైమ్ వస్తే చాలు.. వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ యశ్ టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాని, అతని సోదరుడు కృనాల్ పాండ్యాని కూడా కలిశాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న యశ్.. స్టార్ క్రికెటర్స్ ని కలవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇక రాకీభాయ్ తో కలిసి దిగిన ఫోటోలను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. కేజీఎఫ్-3 అని క్యాప్షన్ జోడించాడు. యశ్.. పాండ్యా బ్రదర్స్ ని ముంబైలోనే కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. హార్దిక్ పాండ్యాకి సౌత్ హీరోలంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కడికి వెళ్లినా.. దగ్గరలో ఉండే హీరోలను, ఫేవరేట్ సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడతాడు. కాగా.. ఇదివరకే సెప్టెంబర్ లో హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ గెలిచిన తర్వాత.. హార్దిక్, తన టీమ్ మేట్స్ తో కలిసి రామ్ చరణ్ ని కలిశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి రామ్ చరణ్ కి ఫ్యాన్స్ అయిన ఇండియన్ క్రికెటర్స్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.
ఇప్పుడు యశ్ విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చిన ఫస్ట్ హీరో. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. రాకీ భాయ్ గా క్రేజ్ పెంచుకొని.. వరల్డ్ వైడ్ కేజీఎఫ్ 2తో ఏకంగా రూ.1200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఈ సినిమా వసూళ్ళలో ఆర్ఆర్ఆర్ ని మించిపోయింది. ఇదిలా ఉండగా.. కేజీఎఫ్ 2కి సీక్వెల్ గా కేజీఎఫ్-3 కూడా త్వరలోనే మొదలు కానున్నట్లు సమాచారం. అయితే.. ఈ సీక్వెల్ సినిమాలోకి ముంబై నుండి హార్దిక్ ని ఏమైనా యాక్ట్ చేయించబోతున్నారా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరోవైపు ఇద్దరు స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూడటం ఆనందంగా ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి హార్దిక్ పాండ్యాని కలిసిన రాకి భాయ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.