టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువులు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానంటూ ప్రకటించారు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భజ్జీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
హర్భజన్ సింగ్ కొంతకాలం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తరపున పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. జలంధర్ నివాసి అయిన హర్భజన్ సింగ్ బీజేపీలో చేరతాడంటూ గతంలో వార్తలు వినిపించాయి. పంజాబ్ ఎన్నికల్లో భజ్జీ పోటీచేస్తారని.. బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ.. భజ్జీని కలిశారు. దీంతో భజ్జీ కాంగ్రెస్ లో చేరతారని అంతా ఊహించారు. అయితే, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడలేదు.
As a Rajya Sabha member, I want to contribute my RS salary to the daughters of farmers for their education & welfare. I’ve joined to contribute to the betterment of our nation and will do everything I can. Jai Hind 🇮🇳🇮🇳
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 16, 2022
ఇది కూడా చదవండి: మాజీ క్రికెటర్ న్యాయపోరాటం! 24 గంటల పాటు నిరాహారదీక్ష!
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారం చేపట్టిన అనంతరం హర్భజన్.. ఆప్ లో చేరారు. ఆప్ అతన్ని పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపించింది. హర్భజన్ ను రాజ్యసభ ఎంపీగా నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై అప్పట్లో వివాదం కూడా చెలరేగింది. దేశవ్యాప్తంగా రైతులందరూ వ్యయసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించినపుడు భజ్జీ ఏమయ్యాడంటూ అప్పట్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైతేనేం.. ఏ రాజకీయ నాయకుడు తీసుకొని.. మంచి నిర్ణయం తీసుకున్న భజ్జీని అందరూ మెచ్చుకోవాల్సిందే.
ఇది కూడా చదవండి: తొలి మ్యాచులోనే ట్రిపుల్ సెంచరీ! ఈ క్రికెటర్ కథ వింటే కన్నీళ్లు ఆగవు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.