టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20ల సిరీస్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్ ను కైవసం చేసుకునేందుకు భారత్ జట్టుతో పాటు ప్రత్యర్థి జట్టు సైతం పోటీపడుతోంది. ఇక విశాఖలో జరిగిన మూడో పోరులో 48 పరుగుల తేడాతో భారత్ సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. అయితే తొలుత 2-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సఫారీల జోరుకు భారత్ ఈ విజయంతో అడ్డుకట్ట వేసినట్లు అయింది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి పంత్ సేన దక్షిణాఫ్రికా జట్టుకు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత్ జట్టు రాజ్ కోట్కు చేరుకునే క్రమంలో వీరి విమాన ప్రయాణంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
విమానంలో పొగలు వస్తుండగా అందులోంచి దినేశ్ కార్తీక్ హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే విమానంలో కూర్చున్న మిగతా ప్లేయర్స్ అంతా చప్పట్లు కొట్టారు. దీనిని చూసిన డీకే నవ్వుతూ అందిరికీ కృతజ్ఞతలు తెలిపాడు. చాలా కాలం తర్వాత దినేష్ కార్తీక్ తన పదునైన ఆట తీరుతో శభాష్ అనిపిస్తుండడంతో మిగతా ఆటగాళ్లు కావాలనే ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. బీసీసీఐ పంచుకున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో కాస్త వైరల్గా మారింది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో డీకే కీలక ఆటగాడిగా రాణించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Manoj Tiwary: ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మరో సెంచరీ కొట్టిన క్రీడా మంత్రి మనోజ్ తివారి!
ఇటీవల ముగిసిన ఐపీఎల్ లోనూ దినేష్ కార్తీక్ తన అద్భుతమైన ఆటతీరుతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. రాబోయే ప్రపంచ కప్ లో అతడిని మంచి ఫినిషనర్ గా ఉపయోగించుకోవాలనే విధంగా టీమ్ ఇండియా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఐర్లాండ్ పర్యటనలోనూ దినేశ్ కార్తీక్కు చోటు దక్కడం విశేషం. ప్రస్తుతం వైరల్ మారిన విమానంలో డీకే ఎంట్రీ సీన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
If your mates don’t hype you like this, are they really your mates? 🤷♂️#PlayBold #WeAreChallengers #ನಮ್ಮRCB #DineshKarthikpic.twitter.com/4rEAKtebtg
— Royal Challengers Bangalore (@RCBTweets) June 16, 2022