ఆటలో ప్రతీ గెలుపుకి కారణాలు ఉన్నట్లే.. ఓటమికి కూడా కారణాలు ఉంటాయి. తాజాగా టీమిండియాతో జరిగిన టీ20 లో ఆసిస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే తమ ఓటమికి కారణాలేంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో మా ఓటమిని శాసించింది కేవలం ఇద్దరే అని పేర్కొన్నాడు. వాళ్ల వల్లే.. గెలిచే మ్యాచ్ ను మేం ఓడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ దాదాపు రెండున్న గంటలు ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. దీంతో మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాజాగా జరిగిన 2వ టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసిస్ ను చిత్తు చేసింది. దాంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఫించ్.. జట్టు ఓటమికి కారణాలను వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ..”రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్.. మేం ఓడిపోవడానికి ప్రధాన కారణం. రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్.. అక్షర్ అత్యద్భుతమైన బౌలింగ్ తో విజయాన్ని మా నుంచి లాగేసుకున్నారు. అతడు రెండు ఓవర్లలో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక గతంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మ్యాచ్ ను 5 ఓవర్ల కు కుదించేవారు. కానీ ఇక్కడ కొద్దిగా భిన్నంగా 8 ఓవర్లకు కుదించారు. జోరు మీదున్న మా టీమ్ ను మాక్స్ వెల్, డేవిడ్ లను అవుట్ చేయడం ద్వారా అక్షర్ మా టీమ్ లయను దెబ్బతీశాడు.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మ్యాథ్యూ వేడ్ మరో సారి తన బ్యాట్ కు పనిచెప్పాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. జంపా సైతం 3 వికెట్లతో చక్కటి ప్రదర్శన చేశాడు. ఇక మా ఓటమిని శాసించిన మరో టీమిండియా క్రికెటర్ ఎవరంటే? కెప్టెన్ రోహిత్ శర్మ తన థండర్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి మా బౌలర్ల లయను దెబ్బతీశాడు. దాంతో వారు ఆత్మరక్షణలో పడటంతో.. టీమిండియా పని సులువుగా అయ్యింది. అయితే ప్రపంచ కప్ కు ముందు మాకు ఈ టోర్నీ బాగా ఉపయోగపడుతోంది. జట్టులోని లోటుపాట్లను సరిదిద్దుకుని మేం మరింతగా ముందుకు వెళ్తాం” అని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. మరి ఫించ్ అన్నట్లుగా వారి ఓటమికి రోహిత్, అక్షర్ లే కారణంమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.