AFC ఆసియాకప్ క్వాలిఫయింగ్లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ యుద్ద వాతావరణాన్ని తలపించింది. ఆఖరివరకూ ఉత్కంఠభరితంగా సాగన ఈ మ్యాచులో విజయం టీమిండియాను వరించగా.. దీన్ని ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు సహించలేకపోయారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ.. తిట్టుకుంటూ.. కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఆసియా కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సునీల్ చెత్రీ సేన(టీమిండియా) 2-1 తేడాతో అఫ్గానిస్తాన్పై విజయం సాధించింది. ఆఖరి వరకు డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్లో 85వ నిమిషంలో భారత్కు వచ్చిన ఫ్రీకిక్ అవకాశాన్ని.. సునీల్ చెత్రీ గోల్గా మలిచి ఆధిక్యాన్ని అందించాడు. ఇక.. మ్యాచ్ టైం ముగియడంతో.. రిఫరీ ఫైనల్ విజిల్ వేయగానే ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ మొదలైంది.
India vs Afghanistan Fight 🔥🔥#IndianFootball #ISL #BlueTigers pic.twitter.com/jlvU1P8CKe
— Navaneed M 🏳️🌈 (@mattathil777777) June 12, 2022
ఇది కూడా చదవండి: Video: మద్యం మత్తులో యువతి అర్ధనగ్న ప్రదర్శన.. లాక్కెళ్లిన సిబ్బంది
ఇద్దరు భారత ఆటగాళ్లు మైదానం వీడే సమయంలో.. ఈ గొడవ మొదలయ్యింది. అనంతరం మిగతా ఆటగాళ్లు సైతం గ్రౌండ్లోకి పరుగెత్తుకుంటూ వచ్చి ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో అక్కడ గొడవ తీవ్రమైంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ రిజర్వ్ ఆటగాడు ఒకరు భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు ముఖంపై కొట్టడం వీడియోలో కనిపించింది. ఇక ఈ విషయమై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు.
Magic from @sahal_samad for the W 🪄 pic.twitter.com/LXQegeZzJl
— Blue Pilgrims 🇮🇳 (@BluePilgrims) June 11, 2022