ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య ఆఖరివరకు ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో సఫారీలు బోణి కొట్టిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్ను ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే చేధించారు ప్రొటీస్ ఆటగాళ్లు. పరుగుల వేటలో సఫారీలు చతికిలపడుతున్నారని అనుకుంటున్న సమయంలో డేవిడ్ మిల్లర్, వాండర్ డస్సెన్ అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికాకు అనూహ్య విజయాన్ని అందించారు. అయితే.. ఈ మ్యాచులో ఒకవైపున ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. మరోవైపు మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు.
అరుణ్ జైట్లీ వేదికగా తొలి టీ20 జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్ట్ స్టాండ్ లోని పలువురు ప్రేక్షకులు గొడవకు దిగారు. ఒకరిమీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో.. ఇద్దరు ఒకవైపు మరో ఐదారుగురు ఒక వైపు ఉండి కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఘర్షణ పడుతున్న వారిని పక్కకు తీసుకెళ్లారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రేక్షకులంతా మ్యాచ్ ను మానేసి వీళ్ల గొడవనే చూస్తుండిపోయారు. అయితే.. ఈ గొడవకు ప్రధాన కారణం.. శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ డ్రాప్ చేయడమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయ్యర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో.. వల్గర్ గా కామెంట్ చేశారని అందుకే గొడవ మొదలైందని కామెంట్స్ చేస్తున్నారు.
Pant Fans With Iyer Fans After Catch Drop #QilaKotla #INDvsSA pic.twitter.com/bSwVkiCgGK
— Veerot Popa (@Veerot_Popa) June 10, 2022
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది. రస్సి వాన్ డెర్ డసెన్ (75), డేవిడ్ మిల్లర్ (64) లు రెచ్చిపోయి ఆడి సఫారీలకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఏదేమైనా మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఇలా.. బాహా బాహీకి దిగడం కరెక్ట్ కాదు అని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rassie and Miller Show is on in #India #Live #INDvSA #INDvsSA 1st #T20 won by SA by 7 Wickets needing 212 to #Win against #India https://t.co/bmzPl3y2Sr
— ken knock (@golf_twit) June 10, 2022