టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి భారత మాజీ ఆటగాళ్లతో విభేధాలుండేవా? లేదంటే కావాలనే అలా సృష్టిస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలియనప్పటికీ.. ధోనీ పేరు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ధోనీ వల్లే నాశనమైందన్నది.. దాని సారాంశం. ఈ విషయంపై.. ధోనీ అభిమానులకు, ధోని హేటర్స్ కు మద్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. దీనిపై.. ఇర్ఫాన్ పఠాన్ కూడా నోరువిప్పాడు.
స్వింగ్ బౌలర్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్ అనతి కాలంలోనే స్టార్ బౌలర్ గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. ఆపై.. గంగూలీ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ధోని కెప్టెన్సీలో ఆడాల్సి వచ్చింది. అలా ధోనీ సారధ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడమే కాకుండా, ఆ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఇక్కడ నుంచే అతని పతనం మొదలైంది. బౌలర్ జట్టులోకి వచ్చిన పఠాన్ ను ఆల్ రౌండర్ గా మార్చాలని టీమిండియా ఎన్నో ప్రయోగాలు చేసింది. ఆరంభంలో ఇది సక్సెస్ అయినప్పటికీ.. తరువాత విఫలమవుతూ వచ్చింది.
Gripping bro 🤝🤝👏👏 . Correct question@WeirdlyGripping = New celeb @IrfanPathan = ♥️♥️🙏🙏 pic.twitter.com/hvd71c0dKV
— Ayush™ 🇮🇳🚩 (@vkkings007) September 27, 2022
ఈ క్రమంలో ధోనీ.. ఇర్ఫాన్ పఠాన్ కు అవకాశాలివ్వడమే తగ్గించేశాడు. జట్టులో ఉన్నా బెంచ్ కే పరిమితం చేసేవాడు. వాస్తవానికి ఇక్కడ ధోని చేసిందేం లేదు. ఇర్ఫాన్ పఠాన్ ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ధోని సారధ్య బాధ్యతలు చేపట్టాక యువ జట్టును తయారు కావాలని భావించాడు. అందువల్లనే.. సీనియర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లు.. వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్లు మెల్లిమెల్లిగా జట్టుకు దూరమయ్యారు. వీరి బాటలోనే ఇర్ఫాన్ పఠాన్ కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇక పఠాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో 5 వికెట్లు తీసినప్పటికి 2012 తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు.
తాజాగా, ఈ విషయాన్ని ఒక అభిమాని లేవనెత్తాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో అదరగొడుతున్న ఇర్ఫాన్ పఠాన్ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ నాశనమవ్వడానికి ధోని కారణమంటూ..’ ట్వీట్ చేశాడు. “ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్ (ధోనీ), ఆయన మేనేజ్మెంట్ పై ద్వేషం అంతకంతకూ పెరుగుతోంది. తన స్వింగ్ బౌలింగ్ లో ఎన్నో మరుపురాని విజయాలు అందించిన.. ఇలాంటి ప్లేయర్ తన 29 ఏళ్ల వయసులో చివరి వైట్ బాల్ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. నెం.7 ప్లేస్ కు పఠాన్ పర్ఫెక్ట్ ప్లేయర్. కానీ ఇండియా మాత్రం జడ్డూని ఆడించింది” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. ‘దయచేసి ఎవ్వరిని నిందించొద్దు.. కానీ నీ ప్రేమకు థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ విషయంపై ధోని స్పందించడన్నది మనకు తెలుసు. కాకుంటే రాబోవు ఐపీఎల్ లో దీని ప్రస్తావన ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి.
Don’t blame any one. Thank you for love ❤️
— Irfan Pathan (@IrfanPathan) September 27, 2022