క్రీడా ప్రపంచంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ.. అన్న సామెత అక్షరాలా సత్యం. అందుకు తగ్గట్టుగానే ప్రపంచంలో ఏదో ఒక మూల.. ఏదో ఒక జట్టు.. రికార్డు సృష్టిస్తూనే ఉంటుంది. తాజాగా భారతదేశంలోనే ఓ భారీ రికార్డు దులీప్ ట్రోఫీలో నమోదు అయ్యింది. మనం క్రికెట్ లో 100 పరుగులు.. 200 పరుగులతో నెగ్గితేనే వామ్మో.. అంటాం. అలాంటిది ఈ టోర్నీలో సౌత్ జోన్ జట్టు తన ప్రత్యర్థి జట్టు అయిన నార్త్ జోన్ ను ఏకంగా 645 పరుగుల తేడాతో ఓడించింది. 645 పరుగులతో గెలవడం దులీప్ ట్రోఫీ చరిత్రలోనే మెుదటి సారి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దులీప్ ట్రోఫీలో భాగంగా.. తమిళనాడులోని సేలం క్రికెట్ స్టేడియాం వేదికగా నార్త్ జోన్-సౌత్ జోన్ జట్లు సెమీఫైనల్లో తలపడ్డాయి. టాస్ గెలిచిన సౌత్ జోన్ మెుదటగా బ్యాటింగ్ చేపట్టింది. సౌత్ జోన్ తన మెుదటి ఇన్నింగ్స్ ను 630/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సౌత్ జోన్ ఇన్నింగ్స్ లో రోహన్(143), విహారీ(134) సెంచరీలతో కదంతొక్కారు. నార్త్ జోన్ బౌలర్లలో మయాంక్ డాగర్ 3/184 వికెట్లతో సత్తాచాటాడు. ఇక నార్త్ జోన్ తన మెుదటి ఇన్నింగ్స్ లో కేవలం 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌత్ జోన్ బౌలర్ సాయి కిశోర్(7/70) తన స్పిన్ మాయాజాలంతో నార్త్ జోన్ జట్టును కుప్పకూల్చాడు. ఇక తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ జోన్ 316/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
దీంతో నార్త్ జోన్ 740 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగగా కేవలం 94 రన్స్ కే కుప్పకూలింది. సౌత్ జోన్ బౌలర్లు అయిన త్యాగరాజన్(3/12), సాయి కిశోర్(3/28), కృష్ణప్ప గౌతమ్(3/50) వికెట్లతో ప్రత్యర్థిని కాకావికలం చేశారు. నార్త్ జోన్ జట్టులో ఓపెనర్ యశ్ ధూల్ 58 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 59 పరుగులు చేయడం గమనార్హం. యశ్ కాకుండా మనన్ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోరు ను సాధించారు. సౌత్ జోన్ బౌలర్ సాయి కిశోర్ ఈ మ్యాచ్ లో 10 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బుధవారం ఫైనల్లో వెస్ట్ జోన్ తో సౌత్ జోన్ తలపడనుంది. 645 పరుగులతో గెలవడం అనేది దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే మెుదటి సారి. మరి ఇంతటి భారీ విజయాన్ని సాధించిన సౌత్ జోన్ జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
✨2022/23 Duleep Trophy – Semi Final✨
🔥South Zone (630/8d & 316/4d) beat North Zone (207 & 94) by 645 runs
📸 : Lalith Kalidas #CricketTwitter #DuleepTrophy #Cricket #India pic.twitter.com/7xHB0hMZZW
— Indian Domestic Cricket Forum – IDCF (@IndianIdcf) September 18, 2022
South Zone beats North Zone by 645 runs to reach Duleep Trophy final#CricketTwitter #DuleepTrophyhttps://t.co/vf6EkiHezO
— Indian Domestic Cricket Forum – IDCF (@IndianIdcf) September 19, 2022