ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ విన్నర్ న్యూజిలాండ్ను ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్ చేసింది. టెస్టులను టీ20 తరహాలో ఆడుతూ.. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ నేతృత్వంలో ఇంగ్లండ్ అద్భుతంగా చెలరేగింది. న్యూజిలాండ్ను టెస్టుల్లో మట్టికరిపించి.. జూలై 1న ఇండియాతో టెస్టు మ్యాచ్కు సిద్ధమైంది. న్యూజిలాండ్పై ఇంగ్లండ్ అసాధారణ ఆటను చూస్తే.. ఇండియాతో టెస్టు కూడా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ టెస్టుల ఆట తీరును పూర్తిగా కొత్తగా మార్చేస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ చూడ్డానికి పూర్తి ఆకర్షణీయంగా, ఆనందదాయకంగా ఉంది. #BazBall. ఇకపోతే భారత్ మరియు ఇంగ్లాండ్ల మధ్య అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ జరగడం ఖాయంగా కన్పిస్తుంది’ అంటూ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్ ఎంత పటిష్టంగా ఉన్నా కూడా భారత్ను ఓడించడం అంత ఈజీ కాదు. ఈ ఏకైక టెస్టు స్వదేశంలో జరగడం ఒక్కటే ఇంగ్లండ్కు కలిసొచ్చే అంశం.
కాగా దినేష్ కార్తీక్ న్యూజిలాండ్పై ఇంగ్లండ్ విజయాన్ని ప్రశంసిస్తూనే.. వారిని ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో కార్తీక్ ట్వీట్ వైరల్ అవుతోంది. న్యూజిలాండ్పై విజయంతో జోష్లో ఉన్న ఇంగ్లండ్ స్వీట్వార్నంగ్ ఇచ్చాడంటూ అభిమానులు పేర్కొంటున్నారు. బలమైన ప్రత్యర్థి ఎదురైతే.. విక్రమ్ సినిమాలో చెప్పినట్లు ‘ఇలాంటి సమయంలో వీరులంతా చెప్పే మాటేంటో తెలుసా.. పదా చూసుకుందాం’ అన్న రితీలో దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఇక ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య చివరి టెస్టు చివరి రోజున 113 పరుగులు చేయాల్సి రాగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 82పరుగుల వద్ద తన మొదటి ఓవర్లోనే ఔటయ్యాడు. ఇక ఈ సంతోషం న్యూజిలాండ్కు ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి జానీ బెయిర్స్టో దిగి విధ్వంసం రేపాడు. టెస్ట్ క్రికెట్లో రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. బెయిర్స్టో కేవలం 30బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. అతనికి తోడు రూట్ అజేయంగా నిలిచాడు. దీంతో చివరి రోజు ఇంగ్లాండ్ కేవలం 15.2ఓవర్లలోనే 113పరుగులు ఛేదించి సిరీస్ 3-0తో వైట్ వాష్ చేసింది. ఇక బెయిర్స్టో (71పరుగులు), రూట్ (86 పరుగులు) కడవరకు క్రీజులో ఉండి లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ విజయం పట్ల చాలా మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో పలు మార్పులు జరిగాయి. అలాగే టెస్ట్ క్రికెట్ ఆడే విధానంలోనూ ఒక కొత్త ఒరవడిని ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు తీసుకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్లో కూడా ఇంత మజా ఉంటుందని తెలిపేలా ఓ రివల్యూషన్ను ఇంగ్లాండ్ జట్టు చూపిస్తోంది. జులై 1న ఇండియాతో ఇంగ్లాండ్ సిరీస్లోని రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్లో కూడా తన ఎటాకింగ్ వ్యూహంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగే అవకాశముంది. ముఖ్యంగా మూడు మ్యాచ్ల సిరీస్లో 3-0తో వైట్ వాష్ చేశాక ఇంగ్లాండ్ ఆత్మస్థైర్యం మామూలుగా పెరగలేదు. ఇక ఈ టెస్ట్కు ముందే అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి తన ప్లేయర్లకు పక్కా సూచనలు ఇచ్చానంటూ బెన్ స్టోక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి న్యూజిలాండ్పై ఇంగ్లండ్ సిరీస్ విజయం, దినేష్ కార్తీక్ ట్వీట్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.