బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం ఊహించని విధంగా సాగుతోంది. ట్వీ20 స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనాను ఏ జట్టు కొనలేదు. దీంతో రైనా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా అమ్ముడు పోలేదు. కాగా యువ సంచలనం దేవదత్త్ పడిక్కల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.7.75 కోట్లకు పడిక్కల్ను దక్కించుకుంది. అలాగే హెట్ మేర్ను రూ.8.50 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. అలాగే ఇంగ్లండ్ ఆటగాడు జెసన్ రాయ్ను బేస్ ధర రూ.2 కోట్లకు గుజరాజ్, టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్పను చెన్నై బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు తీసుకుంది.