బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు రోహిత్ సేన బంగ్లాలో అడుగుపెట్టింది. వరల్డ్ కప్ వేటలో తగిలిన గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయంలో తీసుకున్న తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కో బంగ్లా పర్యటనకు సిద్ధమైంది. అయితే.. వరల్డ్ కప్లో చోటు దక్కని యువ బౌలర్లకు బంగ్లా సిరీస్కు ఎంపిక చేశారు. మొహమ్మద్ సిరాజ్, శార్ధుల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ లాంటి యంగ్ బౌలర్లకు ఈ టూర్లో చోటు దక్కింది. అయితే.. మొహమ్మద్ షమీని సైతం ఈ సిరీస్కు ఎంపిక చేసినా.. గాయం కారణంగా షమీ చివరి నిమిషంలో సిరీస్కు దూరం అయ్యాడు. అతని స్థానంలో మరో యంగ్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్కు అవకాశం దక్కింది.
అయితే.. బంగ్లాదేశ్తో సిరీస్ కోసం న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన భారత క్రికెటర్ దీపక్ చాహర్కు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగించుకుని అటునుంచి అటే బంగ్లాదేశ్కు బయలుదేరిన భారత క్రికెటర్ల బృందం మలేషియా ఎయిర్లెన్స్ విమానయాన సంస్థ ఫ్లైయిట్లో ప్రయాణించింది. బిజినెస్ క్లాస్లో కూర్చున్నా.. కొన్ని అసౌకార్యలు ఎదురైనట్లు దీపక్ చాహర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ‘కనీస సమాచారం ఇవ్వకుండానే విమానం మార్చేసి.. బిజినెస్ క్లాస్లో కూర్చున్నా.. కనీసం భోజనం కూడా ఇవ్వలేదని, పైగా 24 గంటల పాటు లగేజ్ కోసం వేచి ఉండేలా చేశారని, రేపు తమకు మ్యాచ్ ఉందన్న విషయం వీరికి గుర్తుందా?’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు.
కాగా.. భారత్ నుంచి మిగతా జట్టు సభ్యులు శుక్రవారమే బంగ్లాదేశ్ చేరుకుని.. శనివారం ప్రాక్టీస్ సైతం మొదులపెట్టారు. అయితే.. న్యూజిలాండ్ నుంచి రిషభ్ పంత్, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాళ్లు వచ్చి భారత జట్టుతో కలవనున్నారు. కాగా.. రేపు(ఆదివారం) ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో భారత్-బంగ్లా తొలి వన్డే జరగనుంది. ఇదే స్టేడియంలో రెండో వన్డే డిసెంబర్ 7న జరగనుంది. ఇక చివరి వన్డే చిట్టగాంగ్లో డిసెంబర్ 10న జరగనుంది. భారత కాలమానం ప్రకారం మూడు వన్డేలు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి.
Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022