ఆసియా కప్-2022 క్రికెట్ అభిమానులకు అసలైన టీ20 మజాను అందిస్తోంది. దాయాదుల పోరు 2022 సంవత్సరంలోనే అది పెద్ద మ్యాచ్గా నిలిచింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అయితే 1.30 కోట్ల మంది లైవ్ వీక్షించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాక్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్లు పెవిలియన్ చేరిన సమయంలో నిలకడగా ఆడుతూ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు. టాపార్డర్లో కోహ్లీ మినహా ఎవరూ రాణించలేదు. కోహ్లీ ఎంతో మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాంటూ మాజీలు సైతం ప్రశంసించారు. అయితే ఇప్పుడు కోహ్లీ ఇన్నింగ్స్ పై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా భిన్నంగా స్పందించాడు. అసలు కోహ్లీ ఆడింది ఒక ఇన్నింగ్సేనా అంటూ పెదవి విరిచాడు.
“విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ మొత్తంలో కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలో బంతులను ఎదుర్కొనేందుకు కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫఖర్ జమాన్ రూపంలో కోహ్లీకి లైఫ్ దొరికింది. లేదంటే రెండో బంతికే పెవిలియన్ చేరేవాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో ఇన్ సైడ్ ఎడ్జ్ లు చాలానే అయ్యాయి. కేఎల్ రాహుల్ కూడా దురదుష్టవశాత్తూ ఇన్ సైడ్ ఎడ్జ్ కే బౌల్డ్ అయ్యాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
“నిజానికి కోహ్లీ ఆడింది గొప్ప ఇన్నింగ్ ఏమీ కాదు. మ్యాచ్ మొత్తంలో ఒకే ఒక గొప్ప షాట్ ఆడాడు. నిజానికి కోహ్లీ ఇంకా పరుగులు చేయాల్సింది. కోహ్లీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ను ఎక్స్ ట్రా కవర్ దిశగా ఆడటానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. సచిన్తో కలిసి ఆడే సమయంలో కోహ్లీ ఇదే షాట్ ఆడి ఔటవ్వగా.. అలా ఆడొద్దని సచిన్ చెప్పినట్లు నాతో ఒకరు చెప్పారు. మళ్లీ కోహ్లీ అలాంటి షాట్ ఆడి ఔటయ్యాడ” అంటూ డానిష్ కనేరియా చెప్పుకొచ్చాడు. డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.