ఇటీవల క్రీడా రంగంలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియన్ క్రికెట్ లో తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందే.. మరో దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి చెందారు. శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ మరణించినట్లు తెలుస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వీన్స్ లాండ్ లో ఆండ్రూ సైమండ్స్ వేగంగా వెళ్తున్న కారు బోల్తాపడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్ర గాయాలైన సైమండ్స్ చికత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ఆయన మరణ వార్త విన్న క్రికెట్ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్నారు. సైమండ్స్ 1998 నుంచి కెరీర్ ఆరంభిచారు. మొత్తం 26 టెస్టులు, 198 వన్డేలు,14 టీ20లు,39 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. సైమండ్స్ మృతితో క్రీడా ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
ఆండ్రూ సైమండ్స్ అత్యంత సన్నిహితులైన జాసన్ గిలెస్పీ, ఆడం గిల్క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ లు తమ బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటికీ ఆయన మృతిపై నమ్మకం కలగడం లేదని.. అంత గొప్ప ఆటగాడు ఇలా అర్థాంతరంగా చనిపోవడం క్రీడా రంగానికి ఎంతో లోటు అని ట్వీట్ చేశారు. ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ అకాల మరణంపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul 🙏#RIPSymonds
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022