టీ20 వరల్డ్ కప్ సమీపిస్తోన్న వేళ టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే మోకలి గాయం కారణంగా రవీంద్ర జడేజా ప్రపంచ కప్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సైతం వరల్డ్ కప్ నుంచి వైదొలిగాడు. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్ కు అందుబాటులో లేడు. ఇక అతడిని పరిశీలించిన వైద్య బృందం అతడికి ఆరు నెలల విశ్రాంతి అవసరం అని తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించినట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ముందు కీలక ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం భారత్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే బుమ్రా పై ఇంటా.. బయట విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఆరోగ్యం సహకరించనప్పుడు IPL లాంటి టోర్నీలు ఎందుకు ఆడాలి.. డబ్బు మీదున్న గౌరవం.. దేశం మీద లేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జస్ప్రిత్ బుమ్రా.. ప్రపంచ మేటి బౌలర్లలో ఒకడు. తన యార్కర్లతో బ్యాట్స్ మెన్ కళ్లుబైర్లు కమ్మేలా చేస్తాడు. అదీ కాక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరుగాంచాడు. అయితే బుమ్రా లేకపోవడంతోనే భారత్ వరుస పరాజయాల పాలవుతోంది అని.. వెంటనే బుమ్రాను జట్టులోకి తీసుకురావాలని ఇంటా బయట ఒత్తిడి వచ్చింది. దాంతో ఆసిస్ తో జరిగిన 2వ టీ20తో టిమిండియాలోకి అడుగుపెట్టాడు బుమ్రా. జట్టులోకి రానైతే వచ్చాడు కానీ.. మునుపటి ఫామ్ ను మాత్రం అందుకోలేదు. పైగా ఆసిస్ తో జరిగిన రెండు టీ 20ల్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆసిస్ తో జరిగిన చివరి టీ20లోనే అతడి గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో అతడు బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక టీ20 వరల్డ్ కప్ ముందు బుమ్రా టీమిండియా కొంప ముంచాడని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అతడికి వెన్ను నొప్పి ఉందని తెలిసినప్పటికీ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ ఎందుకు ఆడాడు అని ప్రశ్నిస్తున్నారు. అప్పడు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే.. ప్రస్తుత ప్రపంచ కప్ కు అందుబాటులో ఉండేవాడేగా అంటున్నారు. ఇక బుమ్రాకు డబ్బు మీద ఉన్న ఆశ.. దేశానికి ప్రపంచ కప్ తేవాలన్న దాని మీద లేదని వారు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ లో ఆటగాళ్లు సుదీర్ఘంగా మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. దాంతో శారీరకంగా.. మనసికంగా ఆటగాడి మీద ఒత్తిడి పడుతుంది. అది ఆటగాడి సుదీర్ఘ కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే బుమ్రా ఎదుర్కొంటున్నాడు. బుమ్రా IPLలో 120 మ్యాచ్ లు ఆడి 145 వికెట్లు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం 60 మ్యాచ్ ల్లో 70 వికెట్లు మాత్రమే నేలకూల్చాడు.
ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో ఓటమి తర్వాత ఐపీఎల్ ను బాయ్ కాట్ చేయలంటూ.. పెద్ద ఎత్తున ట్వీటర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ విషయాలపై బీసీసీఐ ఉలుకూ.. పలుకూ లేకుండా ఉండటంపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డబ్బున్న టోర్నీని ని నిర్వహిస్తున్నామన్న పేరొక్కటే మీకు కావాలా? వ్యక్తిగతంగా జట్టుకు అది ఎంత పెద్ద గాయం చేస్తుందో తెలుసుకోరా? అంటూ వారు బీసీసీఐని తెగ తిట్టిపోస్తున్నారు. అయితే బీసీసీఐ ఈవిషయాలన్ని పక్కన పెట్టి.. దేశానికి నాణ్యమైన ఆటగాళ్లను అందిస్తున్నమంటూ.. ఊదరగొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ముందు దేశం.. ఆ తర్వాతే ఏదైనా అనే విషయాన్ని ఎప్పుడైతే ఆటగాళ్లు తెలుసుకుంటారో! అప్పుడే భారతదేశానికి మరిన్ని ప్రపంచ కప్ లు అందుతాయి అన్నదాంట్లో సందేహం లేదు.
🚨 UPDATE 🚨
Jasprit Bumrah complained of back pain during India’s practice session on Tuesday. The BCCI Medical Team assessed him. He is ruled out of the first #INDvSA T20I.#TeamIndia
— BCCI (@BCCI) September 28, 2022