టీమిండియాకు బ్యాటింగ్ పరంగా ఏ ప్రాబ్లమ్ లేదు. ఒకరు మిస్ అయినా సరే మరో బ్యాటర్ ఆదుకుంటారు. కెప్టెన్ రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్.. ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. కానీ సమస్యల్లా బౌలర్ల వైపు నుంచే. ఎందుకంటే బుమ్రాపై అతిగా ఆధారపడుతూ వచ్చారు. కానీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు మనోడు గాయపడటంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది. అయితే బుమ్రా కంటే మంచి బౌలర్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్లకే సరైన ఛాన్సులు రావట్లేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. 150కి పైగా కిలోమీటర్ల స్పీడుతో బంతులేసే ఇతడికి టీమిండియాలో ఛాన్సులు ఇవ్వట్లేదేమోనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ తో సిరీస్ లోనూ మనోడు ఆకట్టుకునే బౌలింగ్ చేశాడు. ఇది చూసిన చాలామంది నెటిజన్స్.. టీ20 వరల్డ్ కప్ లోనూ మనోడికి ప్లేస్ ఇవ్వాల్సింది అని అభిప్రాయపడ్డారు. కానీ ఉమ్రాన్ తండ్రి మాత్రం చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. తన కొడుకు ఇంకా పిల్లాడే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి.
‘టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలోకి ఉమ్రాన్ ని ఎంపిక చేయకపోవడం ఓ రకంగా మంచిదే. ఎందుకంటే కొన్ని విషయాల్లో కంగారు పడకూడదు. వాడు ఇంకా నేర్చుకునే స్టేజీలోనే ఉన్నాడు’ అని ఉమ్రాన్ మాలిక్ తండ్రి అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే.. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే తల్లిదండ్రులకు ఇంకా పిల్లల్లానే కనిపిస్తారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఉమ్రాన్.. సరిగ్గా కుదురుకుంటే మాత్రం వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో అతడికి చోటు దక్కే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో? ఉమ్రాన్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.