క్రికెట్ లో బెస్ట్ ఫార్మాట్ అంటే అందరూ టీ20 అని చెబుతారు గానీ ఆటగాళ్లలో సత్తాని బయటకు తీసేది మాత్రం టెస్టులే. ఎందుకంటే జట్టుని గెలిపించడం కోసం ఐదు రోజుల పాటు మ్యాచ్ ఆడటం, అది కూడా చాలా ఓర్పుతో ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ ఆటగాళ్లందరూ కూడా ఈ ఫార్మాట్ లో రాణించి.. అభిమానుల మనసు గెలుచుకున్నవాళ్లే. ఇప్పుడు మాత్రం టెస్టులు ప్రమాదంలో పడినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐసీసీ కూడా ఏదో తూతూ మంత్రంలా టెస్టు సిరీస్ లు నిర్వహిస్తుంది తప్పితే పక్కాగా ఆర్గనైజ్ చేయడం లేదు. ఇప్పుడు ఇదే విషయం ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ సీరియస్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై సంచలన ఆరోపణలు చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టెస్టు క్రికెట్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స్టోక్స్, అన్ని దేశాలు కూడా ఇంగ్లాండ్ లా అటాకింగ్ గేమ్ ఆడాలని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ రిజల్ట్ కంటే అభిమానులను ఎంటర్ టైన్ చేయడమే ముఖ్యమని, అప్పుడు టెస్టు క్రికెట్ మళ్లీ పాపులర్ అవుతుందని అన్నాడు. రీసెంట్ గా జరిగిన టెస్టు సిరీస్ లోనే స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 3-0తో పాక్ పై నెగ్గింది. తాజాగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలోనూ స్టోక్స్.. ఏకంగా రూ.16.25 కోట్లు పలికాడు. ఇక టీ20ల్లో ఇతడు అద్భుతమైన ఆల్ రౌండర్ అయినప్పటికీ.. టెస్టు క్రికెట్ ని కూడా బతికించుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఐసీసీకి పలు విజ్ఞప్తులు చేస్తున్నాడు. ఇవి కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
‘మ్యాచుల షెడ్యూల్ పై ఐసీసీ అంతగా దృష్టి పెట్టడం లేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ నిర్వహించడమే అందుకు ఎగ్జాంపుల్. వన్డే సిరీస్ లో మూడు ఫార్మాట్స్ ఉన్నాయా అనేట్టుగా ఐసీసీ ధోరణి కనిపిస్తుంది. టీ20 లీగ్స్ కారణంగా టెస్టు క్రికెట్ పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. అయితే క్రికెటర్లకు ఆడటానికి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. నా వరకు టెస్టు ఫార్మాట్ అనేది క్రికెట్ కు చాలా ముఖ్యం’ అని స్టోక్స్ చెప్పాడు. మరి ఇతడి మాటల్ని కాకపోయినా సరే ప్రస్తుత పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అయినా సరే టెస్టు క్రికెట్ కోసం ఐసీసీ కృషి చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక స్టోక్స్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.