టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ జట్టును విజయవంతంగా నడిపించాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీలు గెలవలేదన్న లోటు తప్పిస్తే.. కెప్టెన్గా కోహ్లీ భారత జట్టుకు తన వంత న్యాయం చేశాడు. అప్పుడెప్పుడో గంగూలీ హయంలో చూసిన ఫియర్లెస్ క్రికెట్ను మళ్లీ కోహ్లీ జట్టుతో ఆడించాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చాడు. కోహ్లీ కాలంలో టీమిండియా టెస్టు క్రికెట్లో అరివీర భయంకరమైన జట్టుగా మారింది. ఇప్పటికే కోహ్లీని ఆల్టైమ్ గ్రేట్ టెస్టు కెప్టెన్గా ప్రకటించింది. ధోని తర్వాత టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉంటూనే తన బ్యాట్తోనూ పరుగుల వరద పారించాడు. మరోవైపు ఐపీఎల్లోనూ 2022కు ముందు వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు కెప్టెన్గా ఉన్నాడు.
కానీ.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్పై ప్రభావం చూపుతుందని గ్రహించిన కోహ్లీ.. బ్యాటింగ్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు టీ20 ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్గా తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. టెస్టులు, వన్డేల్లో టీమిండియా కెప్టెన్గా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఐపీఎల్లోనూ ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. కానీ.. బీసీసీఐ మాత్రం కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. వన్డే కెప్టెన్గాను తప్పించింది. దీన్ని అవమానంగా భావించిన కోహ్లీ.. కొన్ని రోజులకే టెస్టు కెప్టెన్గా కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆటగాడిగా కొన్నిరోజులు ఇబ్బంది పడినా.. సెంచరీ లేదనే కారణంతో కోహ్లీ ఫామ్లో లేడనే భ్రమ కలిగింది అందరిలో. ఇక ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్థాన్పై అద్భుత సెంచరీతో విమర్శలకు జవాబు చెప్పిన కోహ్లీ.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లోనూ అదరగొట్టిన విషయం తెలిసిందే.
కానీ.. కోహ్లీ తప్ప మిగతా జట్టు విఫలం అవ్వడంతో సెమీస్లో ఓడి, ఇండియా ఇంటికొచ్చింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కమిటీ.. జట్టులో ప్రక్షాళనకు సిద్ధమైంది. తొలుత చేతన్ శర్మతో పాటు మొత్తం సెలెక్షన్ కమిటీని తప్పించిన బోర్డు.. తాజాగా.. బంగ్లాదేశ్ టూర్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలతో సమావేశం కానుంది. ఈ కీలక సమావేశంలో బోర్డు పెద్దలు రోహిత్, కోహ్లీ ముందు తన నిర్ణయాలను ఉంచబోతున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2022లో జట్టు వైఫల్యం, వర్క్లోడ్ మేనేజ్మెంట్, యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వటం, జాతీయ జట్టులో చోటు కోసం నెలకొన్న పోటీ. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని రోజర్ బిన్నీ చైర్మన్గా ఉన్న బీసీసీఐ.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయంగా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు రెస్ట్లేని క్రికెట్ ఆడుతున్నారు. దానికి ఐపీఎల్ లాంటి లీగ్ కూడా తోడుంది. అలాగే టీమిండియాలో చోటు కోసం భారీ స్థాయిలో యువ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. దీంతో తుది జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్మెంట్కు తలకు మించిన భారం అవుతోంది. కొంతమంది ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆగ్రహావేశాలు సైతం వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు, కోచ్లతో పాటు.. స్పెషలిస్ట్ క్రికెటర్లకు ఆయా ఫార్మాట్లలో టీమిండియాకు ఆడే అవకాశం కల్పించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్గా పరిమితం చేసి.. హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్గా నియమించి.. ఒక టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతను విరాట్ కోహ్లీ చేతుల్లో పెట్టాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
అందుకోసమే.. బంగ్లాదేశ్ టూర్కు ముందు రోహిత్, ద్రవిడ్, కోహ్లీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించి.. సీనియర్ ప్లేయర్ అయిన కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారు. కోహ్లీ అయితే.. టెస్టు కెప్టెన్సీని బాగా హ్యాండిల్ చేస్తాడని.. మరో వైపు రోహిత్ ఫిట్నెస్, వయసు దృష్ట్యా అతన్ని వన్డేలకు పరిమితం చేయడమే కరెక్ట్ అని బోర్డు పెద్దలు అనుకుంటున్నారు. పైగా తరచు గాయాల పాలవ్వడం కూడా రోహిత్కు మైనస్గా మారింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి మళ్లీ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరీ.. కోహ్లీ దీనికి అంగీకరిస్తాడా? లేదా? అన్నదే అసలు ప్రశ్న.
The BCCI will hold a meeting with Virat Kohli, Rohit Sharma and Rahul Dravid to discuss the roadmap of T20is. (Reported by Indian Express).
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2022