భారత్-ఇంగ్లండ్ మధ్య గతేడాది టెస్టు సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. మన దేశంలో పర్యటించిన ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 227 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 578 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. డొమినిక్ సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ 178 పరుగులకే ఆలౌట్ కావడంతో .. భారత్ ముందు 433 పరుగుల టార్గెట్ ఉంది. కానీ టీమిండియా తమ వికెట్లు కాపాడుకోలేక 192 పరుగులకి ఆలౌట్ అయి మ్యాచ్ ఓడిపోయింది.
ఏ జట్టైనా స్వదేశంలో సిరీస్ ఆడుతుందంటే పిచ్ తమకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. మ్యాచ్ తర్వాత పిచ్ తయారు చేసిన క్యురేటర్పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ ఫలితం తర్వాత చెపాక్ స్టేడియం పిచ్ క్యూరేటర్ని ఆ పదవి నుంచి తొలగించిన బీసీసీఐ కొత్త క్యూరేటర్ని కూడా నియమించింది. తాజాగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఫిక్సింగ్ ఏమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పిచ్ క్యూరేటర్ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తొలి టెస్టు ఆరంభానికి ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్, పిచ్ క్యూరేటర్ని కలిసి పిచ్ ఎలా తయారుచేయాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చారు… మ్యాచ్కి ముందు రోజు సాయంత్రం అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కలిసి చెపాక్లోని చిదంబరం స్టేడియానికి వెళ్లారు…క్యూరేటర్కి, గ్రౌండ్మెన్కి పిచ్ ఎలా తయారుచేయాలో సూచించారు.పిచ్ ఎలా ఉందో అలా వదిలేయాలని నీళ్లు కొట్టడం కానీ, రోలర్ వాడడం కానీ చేయకూడదని తెలిపారు. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్కి నీళ్లు కొట్టిన క్యూరేటర్, రోలర్ కూడా వాడారు. దీంతో పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా మారి, మొదటి రెండు రోజులు బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు. దీంతో టీమిండియా మ్యాచ్ ఓడింది. దీంతో క్యూరేటర్పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఈ ఫిక్సింగ్ ఆరోపణలను బీసీసీఐ అధికారులు కొట్టిపారేశారు. ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదని.. టీమిండియా ఫెయిర్గానే ఓడిపోయిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ise kehte hai match fixing, India vs England today’s match. Dusre bowler ke hote hue use ek bhi over na deke Jo jyada run dele vale bowler ko bowling dete rehna. India used only 5 bower @ICC @BCCI @SGanguly99
— Subhash Patel (@Subhash_Rashtr) March 26, 2021
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.