ప్రపంచ క్రికెట్ లో రిచెస్ట్ బోర్డుగా భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) చలామణి అవుతుంది. కొన్నేళ్లుగా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెట్ బోర్డు బీసీసీఐ కొనసాగుతుంది. ప్రత్యేర్ధులు కూడా అందుకోలేని విధంగా ఆదాయంలో భారత్ క్రికెట్ బోర్డు దూసుకెళ్తుంది. అందుకే ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ని పవర్ హౌస్ అని పిలుస్తారు. తాజాగా ఆదాయంలో తన స్థానాన్ని బీసీసీఐ మరోసారి నిలబెట్టుకుంది. 2021 సంవత్సరంలో అత్యధికా ఆదాయం పొందిన ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో.. 3730 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో ఆస్ట్రేలియ క్రికెట్ బోర్డు నిలిచింది. టైమ్స్ నౌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. భారత్ క్రికెట్ బోర్డు భారీ ఆదాయం సాధించింది. టైమ్స్ నౌ తెలిపిన డేటా ప్రకారం..
గత కొన్నేళ్లుగా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా బీసీసీఐ తన ఆధిపత్యం చల్లాయిస్తుంది. 2021 ఏడాది ఆదాయంలోను భారత్ క్రికెట్ బోర్డు తన ప్రత్యేర్దుల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించినట్లు టైమ్స్ నౌ పేర్కొంది. 2021 లో బీసీసీఐ బోర్డుకి రూ.3730 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రూ. 2843 కోట్లు ఆదాయం రాబట్టింది. ఈక్రమంలో భారత్ క్రికెట్ బోర్డు.. క్రికెట్ ఆస్ట్రేలియా కంటే 23 శాతం అధికంగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇంగ్లాడ్ క్రికెట్ బోర్డు రూ.2135 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉంది. ఇంకా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూ.811 కోట్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రూ.802 కోట్ల ఆదాయంతో వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే క్రికెట్ సౌత్ ఆఫ్రికా రూ.485 కోట్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు రూ210 కోట్లతో ఆరు, ఏడవ స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానాల్లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (రూ.116 కోట్లు), జింబాబ్వే క్రికెట్ బోర్డు (రూ.113 కోట్లు), మరియు, శ్రీలంక క్రికెట్ (రూ.100 కోట్లు) ఈ జాబితాలో చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.