మీరు తండ్రి కాబోతున్నారు.. ఈ మాట విన్న ఏ వ్యక్తి ఆనందానికైనా అవధులుండవు. తొమ్మిది నెలల పాటు తండ్రి కాబోతున్నాననే సంతోషంలో ఉండి.. పుట్టబోయే బిడ్డ గురించి కలలు కని.. భూమ్మీదకు వచ్చిన చిన్నారిని అపురూపంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతాడు తండ్రి. అయితే ఆ సంతోషం ఒక్క రోజులోనే దూరం అయితే.. పుట్టిన బిడ్డ రోజు వ్యవధిలోనే అనంతలోకాలకు వెళ్తే.. ఆ తండ్రి పడే బాధను వర్ణించడం సులభం కాదు. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు బరోడా క్రికెటర్. పుట్టిన బిడ్డ రోజులు వ్యవధిలోనే అనారోగ్యంతో బిడ్డ మరణించిందని చేదువార్త విని.. గుండెలు పగిలే దుఃఖం, ముంచుకొస్తున్న కన్నీళ్లతో టోర్నీ మధ్యలోనే ఇంటికెళ్లి కన్న బిడ్డ అంతిమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆటపై మక్కువతో మళ్లీ తిరిగొచ్చాడు. కూతురు పోయిన బాధను గుండెల్లోనే దిగమింగి సెంచరీతో చెలరేగాడు బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి.
ఇలా బిడ్డ చనిపోయిన బాధ నుంచి తేరుకున్నాడో లేదో.. మరో చేదు వార్త అతడిని చేరింది. విష్ణు సోలంకీ తండ్రి చనిపోయారు. ఇలా రోజులు వ్యవధిలో గుండె పగిలే విషాదాలు విష్ణు సోలంకిని వెంటాడుతున్నాయి. తండ్రి పోయారనే మరణ వార్త ముందుగా టీం మేనేజ్మెంట్ కి చేరింది. కానీ.. ఆ విషయాన్నీ అతనికి ఎలా చెప్పాలో వారికి అర్థం కాలేదు. ఛండీగఢ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విష్ణు సొలంకీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. తన వైపు వచ్చిన ఓ బంతిని అద్భుత డైవ్ తో బౌండరీ వెళ్లకుండా చేశాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న టీమ్ మేనేజ్ మెంట్.. విష్ణు ఫీల్డింగ్ కు చప్పట్లు కొట్టలేకపోతున్నారు. కారణం తన్నుకొస్తున్న బాధ.మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూంకు చేరుకున్న విష్ణుకు.. జట్టు సభ్యులు పిడుగు లాంటి వార్త చెప్పారు. ఆ వార్త విన్న విష్ణు అక్కడే కూలబడిబోయాడు. బాధతో డ్రెస్సింగ్ రూంలో ఓ మూలన కూర్చున్న అతడు.. ఫోన్ లోనే వీడియో కాల్ ద్వారా తన తండ్రి అంత్యక్రియలను చూశాడు. ఏ వర్ధమాన క్రికెటర్ కైనా రంజీ ట్రోఫీలో రాణించడం చాలా ముఖ్యం. దేశవాళీ టోర్నీల్లో రంజీ ట్రోఫీకి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల 11న విష్ణ భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సరిగ్గా 24 గంటలు గడిచాయో లేదో పుట్టిన బిడ్డ అనారోగ్య కారణంతో మరణించింది. ఆ వార్తను విన్న విష్ణు.. తన కూతురిని చివరిసారి చూడటానికి జట్టును వదిలి స్వస్థలానికి చేరుకున్నాడు. తన కూతురి అంత్యక్రియలను పూర్తి చేసి మళ్లీ క్రికెట్ ఆడటానికి జట్టుతో కలిశాడు.
Unreal commitment from Vishnu Solanki who lost his newborn daughter a few days back.#ranjitrophy2022 #CricketTwitter pic.twitter.com/5mwOaD06oc
— CricTracker (@Cricketracker) February 25, 2022
ఈ నెల 17 నుంచి ఆరంభమైన రంజీ ట్రోఫీ తొలి రౌండ్ పోరులో అతడు బరోడా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కారణం.. బయో బబుల్ ను దాటి బయటకు వెళ్లాడు కావున.. నిబంధనల ప్రకారం క్వారంటైన్ ను పూర్తి చేయాలి. అందువల్ల 17 నుంచి ఆరంభమైన తొలి రౌండ్ పోరులో జట్టులో స్థానం దక్కలేదు. ఇక ఈ నెల 23న అతడి క్వారంటైన్ పూర్తవ్వడంతో జట్టుతో కలిశాడు. అనంతరం ఛండీగఢ్ తో ఆరంభమైన మ్యాచ్ లో 165 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు ఉండటం విశేషం. విష్ణు సోలంకి గురుంచి టీం మేనేజ్ మెంట్ స్పందిస్తూ.. ’మేము విష్ణు తండ్రి చనిపోయాడని వార్తను మొదటగా విన్నాం. ఆ వార్తను అతనితో ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు.. బాధతో చాల సేపు అలానే ఉన్నాం. డ్రెస్సింగ్ రూంకు వచ్చాక జరిగిన విషయం చెప్పాము. విష్ణు డ్రెస్సింగ్ రూంలో ఓ మూలన కూర్చొని తండ్రి అంత్యక్రియలను ఫోన్ లో వీడియో కాల్ ద్వారా చూశాడు. ఇది చాలా దారుణం. ఇంతటి కష్టసమయంలో తనకు అండగా ఉంటామని బరోడా జట్టు సారథి కేదార్ దేవ్ ధర్ తెలిపాడు.
Baroda batter Vishnu Solanki is going through one of the toughest phases of his life, having lost his father just a few days after his daughter passed away.#VishnuSolanki #RanjiTrophy#Cricket https://t.co/oDNeNDrHFc
— CricketNext (@cricketnext) February 28, 2022