టీమిండియాలోకి మరో తెలుగమ్మాయి అడుగుపెట్టబోతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్కి ఆదోని అమ్మాయి ఎంపికైంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగనుంది. డిసెంబర్ 9 నుంచి 20 వరకు ఈ సిరీస్ సాగనుంది. ఇందుకు సంబంధించిన మహిళా టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆ జట్టులో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి పేరు కూడా ఉంది. టీమిండియాకి ప్రాతినిధ్యం వహించేందుకు అంజలి శర్వాణికి అవకాశం రావడంపై స్థానికంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి చెందిన అమ్మాయి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టబోతోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఆదోనికి చెందిన అంజలి శర్వాణి తండ్రి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి గృహిణి. ఆదోని మిల్టన్ ఉన్నత పాఠశాలలోనే అంజలి పదో తరగతి వరకు విద్యను అభ్యసించింది. అంజలికి క్రికెట్ మీదున్న ఆసక్తిని ఆమె తల్లిదండ్రులు గ్రహించారు. ఆమెను క్రికెట్వైపు ప్రోత్సహించారు. ఆ తర్వాత అంజలి శర్వాణి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అవకాశం దక్కించుకుంది. అంజలి తల్లిదండ్రులకు స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 17 ఏళ్ల గొంగడి త్రిష అండర్ 19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. వెంటనే అంజలి కూడా ఎంపికవ్వడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
◾️ Pooja Vastrakar and Sneh Rana miss out
◾️ Maiden national call-up for Railways left-arm seamer Anjali Sarvani https://t.co/oLu8MaNSGw | #INDvAUS pic.twitter.com/lXOMuYVz2y— ESPNcricinfo (@ESPNcricinfo) December 2, 2022