టీమిండియా టెస్టు జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తన ఫామ్, కెరీర్పై వస్తున్న విమర్శలపై తొలిసారి నోరు విప్పాడు. రహానే యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా విషయాలను తలచుకుని నవ్వుకుంటున్నాను. క్రికెట్ తెలిసిన వారు ఇలా మాట్లాడరు. ఆస్ట్రేలియాలో ఏం జరిగిందో, అంతకు ముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీనిపై నేనేమీ చెప్పను. అయితే క్రికెట్ను అర్థం చేసుకోని వారు ఇలా మాట్లాడుతున్నారంటూ” విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా సిరీస్ను ఉద్దేశించి.. “నేను అక్కడ ఏం చేశానో నాకు తెలుసు. నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా సిరీస్లో నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. కానీ, దాని ప్రతిఫలాన్ని మరొకరు తీసుకున్నారు. నేను నా గురించి ఎక్కువగా మాట్లాడలేను. కానీ, నా నిర్ణయాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని పేర్కొన్నాడు. ఎవరి పేరును ప్రస్తావించకుండానే రహానే విమర్శలు గుప్పించాడు. నిజానికి, ఆ అద్భుతమైన విజయాల తర్వాత రవిశాస్త్రికి పేరొచ్చింది. MCGలోనే కాకుండా మిగిలిన నాలుగు-మ్యాచ్ల సిరీస్లో కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జట్టును నడిపించిన తీరుకు రహానే క్రికెట్ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
MCG టెస్టులో ముగ్గురు కీలక ప్లేయర్లును టీమిండియా కోల్పోయింది. అలాగే గాయాల కారణంగా సిరీస్లో కీలక ఆటగాళ్లను కోల్పోవడం కొనసాగింది. అయితే వీటన్నింటిని దాటుకుని భారత జట్టు అద్భుత విజయం సాధించింది. అందులో సారథిగా రహానే పాత్ర ఎంతో ఉంది. అయితే రహానే, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరి రహానే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.