ఆఫ్ఘనిస్థాన్ దేశం ఇప్పుడు తాలిబన్స్ వశం అయిపొయింది. దీంతో.., ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితిలు ఒక్కసారిగా మారిపోయాయి. తాలిబన్స్ రాక్షస పాలన గుర్తుకి తెచ్చుకుని ఆ దేశ ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్స్ ఏ రంగాలను ప్రోత్సహిస్తారు? ఏ రంగాలను తొక్కేస్తారు అన్న లెక్కలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ దేశ క్రికెట్ విషయంలో కూడా ఈ చర్చే నడుస్తోంది.
నిజానికి తాలిబన్స్ క్రికెట్ కి వ్యతిరేకం. గతంలో వీరి పాలన జరిగిన సమయంలో ఆఫ్ఘానిస్తాన్ లో క్రికెట్ ని వీరు నిర్వీర్యం చేశారు. అయితే.., దేశంలో మళ్ళీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత.., ప్రపంచ దేశాల ప్రోత్సాహంతో ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ క్రికెట్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్, మహ్మద్ నబి లాంటి స్టార్ ప్లేయర్స్ పుట్టుకొచ్చారు. నిజానికి టీ-20 లలో ఆఫ్ఘనిస్థాన్ టీమ్ ఇప్పుడిప్పుడే శక్తి వంతమైన టీమ్ గా కూడా ఎదుగుతోంది కూడా. ఇలాంటి సమయంలో ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్స్ వశం అవ్వడంతో ఇక ఆ దేశంలో క్రికెట్ ప్రస్థానం ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.., తాలిబన్స్ ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.
ఆఫ్ఘనిస్థాన్ టీమ్ త్వరలో పాకిస్థాన్ టూర్ కి రావాల్సి ఉంది. దీని తరువాత ఆఫ్ఘన్ కీలక ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడాల్సి ఉంది. ఆ తరువాత యూఏఈ వేదికగా టీ-20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. అయితే.., ఇప్పుడు తాలిబన్స్ ఆఫ్ఘన్ ఆటగాళ్లు పాకిస్తాన్ టూర్ కి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. అంతేకాదు.. టీ-20 వరల్డ్ కప్ కి కూడా ఆటగాళ్ల సన్నాహకాలకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ టీమ్ వచ్చిన నష్టం ఏమి లేదు. మరి రానున్న కాలంలో తాలిబన్స్ ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.