సన్రైజర్స్ హైదరాబాద్ 2022 సీజన్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వచ్చినా కూడా ఆ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటివల భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో నికోలస్ పూరన్ అదరగొట్టాడు. అలాగే SRH వేలానికి ముందు రిటైన్ చేసుకున్న యంగ్ హర్డ్ హిట్టర్ అబ్దుల్ సమద్ కూడా సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022లో జమ్ము కశ్మీర్ రాష్ట్రం తరపున ఆడుతున్న సమద్.. పాండిచెర్రితో జరిగిన మ్యాచ్లో కేవలం 68 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
అందులో 19 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మొత్తం 708 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అందులో 88 పరుగుల కేవలం ఫోర్లు, సిక్సుల ద్వారానే వచ్చాయి. కాగా సమద్ ఈ అద్భుత ప్రదర్శనతో సన్రైజర్స్ మేనేజ్మెంట్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. సమద్ను రూ.4 కోట్లకు SRH రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి సమద్ సూపర్ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Power, poise, timing 😍
Catch the highlights of @ABDULSAMAD___1’s explosive #RanjiTrophy century today 🧡#OrangeArmy #ReadyToRise #RanjiRisers #JKvCAP
— SunRisers Hyderabad (@SunRisers) February 19, 2022
1️⃣0️⃣0️⃣ off 6️⃣8️⃣ balls 🔥@ABDULSAMAD___1 has begun his #RanjiTrophy season with a bang 🧡#OrangeArmy #ReadyToRise #RanjiRisers #JKvCAP pic.twitter.com/r5lZ6E0c4b
— SunRisers Hyderabad (@SunRisers) February 19, 2022