మూడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా, టీమిండియాను 2-1 తేడాతో ఓడించింది. మరి ఈ ఓటమితో టీమిండియాకు జరిగిన నష్టం ఎంత? ఒక్క ఓటమితో ఏం ఏం మారిపోయాయి.. ఇప్పుడు తెలుసుకుందాం..
భారత పర్యటనను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-2తో కోల్పోయిన ఆస్ట్రేలియా.. మూడు వన్డేల సిరీస్ను మాత్రం 2-1తో కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడినా.. మూడో టెస్టులో గెలిచి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అలాగే ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓడిన ఆస్ట్రేలియా అనూహ్యంగా పుంజుకుని.. విశాఖపట్నం, చెన్నై వన్డేల్లో విజయకేతనం ఎగరేసింది. ఈ విజయాలతో భారత గడ్డపై టీమిండియాను ఓడించి మరీ వన్డే సిరీస్ను గెలిచింది. ఇదే ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో ఈ విజయం ఆస్ట్రేలియాకు మంచి బూస్ట్ ఇవ్వనుంది.
చివరి వన్డేలో ఓటమితో టీమిండియా సిరీస్ కోల్పోయింది. ఈ ఒక్క మ్యాచ్ ఫలితంతో ప్రపంచ క్రికెట్ వేదికపై టీమిండియాకు తీవ్ర నష్టాలే జరిగాయి. ఈ ఓటమితో టీమిండియా ప్రపంచ నంబర్ వన్ వన్డే టీమ్ హోదాను కోల్పోయింది. ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా ఆక్రమించుకుంది. ఇద్దరికీ సమాన పాయింట్లు ఉన్నా.. ఆస్ట్రేలియా తక్కువ మ్యాచ్ల్లో ఎక్కువ విజయాలు సాధించి.. వరల్డ్ నంబర్ వన్గా అవతరించింది. అలాగే స్వదేశంలో టీమిండియాకు నాలుగేళ్ల తర్వాత తొలి వన్డే సిరీస్ ఓటమి ఎదురైంది. 2019లో స్వదేశంలో ఆడుతూ వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. మళ్లీ ఇన్నేళ్లకు వన్డే సిరీస్ను కోల్పోయింది. దీనితో పాటు మొహమ్మద్ సిరాజ్ సైతం వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్ హోదాను కోల్పోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి పడిపోయాడు. ఈ సిరీస్ ఆడకపోయినా.. జోస్ హెజల్వుడ్ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.
ఇలా ఒక్క ఓటమితో టీమిండియాకు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. నంబర్ టీమ్ హోదాను కోల్పోవడం, స్వదేశంలో వన్డే సిరీస్ ఓటమి, నంబర్ వన్ బౌలర్గా ఉన్న జట్టు సభ్యుడు ఆ స్థానం నుంచి కిందకు పడిపోవడంతో మొత్తం మీద టీమిండియాకు మూడు అవమానాలు ఎదురయ్యాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 47 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు పడగొట్టి రాణించారు. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 49.1 ఓవర్లలో భారత జట్టు 248 పరుగులకు ఆలౌట్ అయి 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 54 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శనతో పాటు జరిగిన నష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We have a new World No.1 🎉
Australia climb to the top of the @MRFWorldwide ICC Men’s ODI Team Rankings after the series victory against India 👏
🗒: https://t.co/CXyR2x0PJJ pic.twitter.com/Ujz1xrWpw0
— ICC (@ICC) March 22, 2023
Australia has displaced India from the top of the ICC ODI rankings following their 2-1 series victory 🏆#INDvAUS pic.twitter.com/tZAA5fARBU
— Circle of Cricket (@circleofcricket) March 22, 2023