దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రజాప్రస్థానం పేరిట రాష్ట్రావ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంది. దానిలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంది షర్మిల. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది షర్మిల. తాను నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం నిరాహార దీక్షలు చేస్తుంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి తనపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి.. సిగ్గుండాలి కదా.. చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో నిరంజన్ రెడ్డి షర్మిలను ఉద్దేశించి మంగళవారం మరదలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
వనపర్తిలో పాదయాత్ర సందర్భంగా షర్మిల నిరంజన్రెడ్డి వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా.. మెట్టు(చెప్పు) దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడని షర్మిల మండిపడ్డారు. ఆయనకు, కుక్కకు తేడా ఏమైనా ఉందా..? అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంజన్ రెడ్డికి అధికార మదం తలకెక్కిందని ఆరోపించారు. తెలంగాణలో హమాలీ పనికి మించిన పని లేదా అని ప్రశ్నించారు. మంత్రి కూడా రాజీనామా చేసి హమాలీ పని చేసుకోవచ్చు కదా అని సూచించారు.
స్త్రీలో చెల్లిని,తల్లిని చూడలేని సంస్కార హీనుడు మంత్రి నిరంజన్ రెడ్డి.అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్. వీధి కుక్కకు నీకు తేడా లేదు.యువత హమాలీ పని చేసుకోవాలని,రైతులు వరి వేసుకోవద్దని చెప్పే నువ్వు ఒక మంత్రివా?#PrajaPrasthanam #Wanaparthy pic.twitter.com/07aZvPURMn
— YS Sharmila (@realyssharmila) September 9, 2022
అంతేకాక.. ‘‘పేరుకు మాత్రమే నీళ్ల నిరంజన్ రెడ్డి. ప్రజలకు మిగిల్చింది మాత్రం కన్నీళ్లే. మంత్రి హోదాలో ఉండి, కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేని దద్దమ్మ. ఒకప్పుడు ఏమీ లేని ఈ మంత్రి కేసీఆర్లాగే వేల కోట్లు సంపాదించాడట. 150 ఎకరాల్లో ఫాంహౌజ్ కట్టుకున్నాడట. ఏ భూములు వదలడట. గుడిని గుళ్లోని లింగాన్ని మింగే రకమట. మందు తాగేవాడు ముఖ్యమంత్రి అయితే.. పెగ్గుపోసేవాడు మంత్రయినా కావాలి కదా.. మీ ఊరి వాళ్లే చెప్పారు నాకు’’ అంటూ షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం షర్మిల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పేరుకు మాత్రమే నీళ్ల నిరంజన్ రెడ్డి. ప్రజలకు మిగిల్చింది మాత్రం కన్నీళ్లే. మంత్రి హోదాలో ఉండి, కనీసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేని దద్దమ్మ. ఒకప్పుడు ఏమీ లేని ఈ మంత్రి KCR లాగే వేల కోట్లు సంపాదించాడట. ఫాంహౌజ్ లు కట్టుకున్నాడట.#PrajaPrasthanam pic.twitter.com/H3M8yyIRuI
— YS Sharmila (@realyssharmila) September 9, 2022