ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తానే క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదంటూనే పార్టీ టికెట్ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు వైసీపీ, ఒకటి టీడీపీ గెలిచిన సంగతి తెలిసింది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలేకి దిగిన టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా గెలిచారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ వేశారని వైస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఉండవల్లి శ్రీదేవి క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ఓటింగ్ ఆరోపణలపై స్పందిస్తూనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ చెప్పిన ప్రకారమే జయమంగళ వెంకట రమణకు ఓటు వేశానని, ఆయనే గెలిచారని మేకపాటి అన్నారు. అంతేకాక క్రాస్ ఓటింగ్ పాల్పడ్డానని తనను ఎవరూ అనటాడనికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓటు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడినని మేకపాటి పేర్కొన్నారు.
అధిష్టానం టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లేకుంటే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాను ఏంటో చూపిస్తానని, జగన్ కూడా టికెట్ విషయంలో తన విషయంలో సానుకూలంగా లేరని పేర్కొన్నారు. ఎవరో తన మీద కావాల్సి ముఖ్యమంత్రి కి తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. మరి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.