విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడుతూ.. సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన వైసీపీ మీద ఆగ్రహంగా ఉన్నారని.. వేరే పార్టీలో చేరతారనే ఊహాగానలు తెర మీదకు వచ్చాయి. వీటన్నింటిని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తోసిపుచ్చారు. తాను అసలు ఏ పార్టీలో లేనని.. భవిష్యత్తులో కూడా ఏ పార్టీలో కూడా చేరనని స్పష్టం చేశారు. అంతేకాక సీఎం జగన్ అంటే తనకు ఎంతో అభిమానం అని.. ఆయనను హీరో అంటానని వెల్లడించారు. సుమన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ జాఫర్కిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తనకు జగన్ అంటే ఎంతో అభిమానం అని.. 2019 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశానని.. తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశానని వెల్లడించారు.
2019 ఎన్నికల సమయంలో.. అంతకుముందు చాలా మంది నాయకులను వైసీపీలోకి పంపాను అన్నారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా సీఎం జగన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని వెల్లడించాడు. ఆయన గెలుపు కోసం పని చేస్తానని.. ఎన్నికల సమయానికి చాలా మందిని వైసీపీలోకి పంపుతానని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ని తాను హీరోగా భావిస్తానని వెల్లడించారు. రాజీనామా అనేది తన వ్యక్తిగత అంశం అని.. దాని గురించి ఎవరికి ఎలాంటి సమస్య లేదన్నారు. పదవికి రాజీనామా చేసిన.. జగన్ గెలుపు కోసం కచ్చితంగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. మరి యార్లగడ్డ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.