నెల రోజుల క్రితం తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా… జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై పలు రాజకీయ ఊహాగానాలు వచ్చాయి. జూనియర్ బీజేపీలో చేరతారని.. లేదంటే.. తెలంగాణలో బీజీపీ తరఫున ప్రచారం చేస్తారని.. ఏపీ బీజేపీకి మద్దతు ఇస్తారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అసలు వీర్ధిరూ ఎందుకు భేటీ అయ్యారనే దాని గురించి సరైన సమాచారం ఎవరి దగ్గర లేదు. ఈ క్రమంలో తాజాగా అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీరి భేటీపై స్పందించారు. తాజాగా సుమన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన అమిత్షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్గా మారాయి.
అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమిత్ షా చేసే ఏ పని అయినా రాజకీయ కోణంలోనే ఉంటుంది. తారక్తో భేటీ అనేది.. పొలిటికల్ గేమ్. రామరావు కుటుంబ సభ్యులు చాలా మంచి వారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. కుమార్తెలు బంగారు తల్లులు. బసవతారకం గారు వారిని చాలా క్రమశిక్షణతో పెంచారు. అనవసర విషయాల్లో వారు జోక్యం చేసుకోరు. ఇక అమిత్ షా పొలిటికల్ గేమ్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణలో సెటిలర్స్ అధికంగా ఉన్న దాదాపు 25 నియోజకవర్గాల్లో.. వారిని ఆకర్షించి.. ఆ స్థానాల్లో గెలవడం కోసమే అమిత్ షా.. తారక్ని కలిశాడనేది నా అభిప్రాయం’’ అని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయనను ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదు అన్నారు. మరి యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.