ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీ ఇంటికి వచ్చి కరోనాకి చికిత్స అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో “ఇంటింటి ఆరోగ్యం” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
కరోనాను ఎదుర్కోవడంలో భాగంగానే “ ఇంటింటా ఆరోగ్యం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏనుగొండలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి జ్వరాలు, దగ్గు ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలున్నాయో అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వర్ధంతి రోజే చంద్రబాబుకు కరోనా… విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, ఇతర ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఎవరికైనా చికిత్స అవసరమైతే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08542 – 241165) ఏర్పాటు చేయడం జరిగిందని, ఫోన్ చేస్తే వైద్య సిబ్బంది ఇంటికే వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు.