Undavalli Arun Kumar: తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘ఉండవల్లి అరుణ్కుమార్’. ప్రభుత్వం ఎదైనా.. తప్పులను ఎత్తి చూపటం ఆయన స్పెషాలిటీ. ఆయన గత కొన్ని సంవత్సరాలనుంచి రాజకీయాల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయినప్పటికి ప్రభుత్వాల తప్పును ఎత్తి చూపుతూ.. ప్రశ్నిస్తున్నారు.. సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1990ల నుంచి.. రాజశేఖరరెడ్డి సీఎం కాకముందునుంచి మా ఇంట్లో వాళ్లు మార్గదర్శిలో డబ్బులు దాచుకుంటూ ఉన్నారు. మాకు తెలిసిన ఏజెంట్ బ్రేయిన్ వాష్ చేసి వాళ్లతో మార్గదర్శిలో డబ్బులు కట్టించాడు. రెండేళ్లకు, మూడేళ్లకు దాన్ని మావాళ్లు రెనివల్ చేసుకుంటూ వస్తున్నారు. 2005లో నేను ఎంపీ అయ్యాక.. ఓ సారి మా వాళ్లు ఫండ్ రెనివల్ కోసం ఓ మార్గదర్శి బ్రాంచ్కు వెళ్లారు. మార్గదర్శి సిబ్బంది రెనివల్ చేయించుకోలేదు. లక్ష అయితేనే రెనివల్ చేస్తామన్నారు. మిగిలిన డబ్బులు తీసుకురమ్మన్నారు.
అప్పుడు మా వాళ్లు డబ్బులు వెనక్కు ఇచ్చేమన్నారు. వాళ్లు వెంటనే ఫండ్ సర్టిఫికేట్ తీసుకుని, ఓ చిన్న కాగితం మీద రిసిప్ట్ ఇచ్చారు. మా అమ్మకు అనుమానం వచ్చి నన్ను అడిగింది. రామోజీరావు కదా.. డబ్బులు ఇస్తాడులే అన్నాను. తర్వాత సర్టిఫికేట్ చూసినపుడు అలా డబ్బులు సేకరించవచ్చా అని నాకు అనుమానం వచ్చింది. అందరినీ ఎంక్వైరీ చేశాను. అలా చేయకూడదని తేలింది. దీని గురించి నేను అప్పటి కేంద్రమంత్రి చిదంబరానికి కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాను’’ అని అన్నారు.