తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే డిసెంబర్ కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తారని, మార్చిలో ఎన్నికలు వస్తాయంటూ రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం చేసిన వ్యాఖ్యలపై ఓవైపు చర్చ జరుగుతుండగా తాజాగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అందరిలో ఆసక్తిని పెంచింది.
“కేసీఆర్ కి రోజులు దగ్గర పడ్డాయని అందుకే దేశమంతా తిరుగుతున్నారు. ఇక్కడ ఉండి.. ప్రజల కష్టాలు తీర్చాల్సి వారు..దేశమంతా దేశ దిమ్మరిలాగా తిరుగుతున్నారు. కేసీఆర్ లాక్కున్న భూములను తిరిగి వెనక్కి ఇస్తాం. కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. కేసీఆర్ కి టెంటు, ఫ్రంట్ రెండు లేవు” అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజక వర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.