కొని రోజులగా ఏపీలోని మన్సాస్ ట్రస్ట్పై జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ వారసత్వ వివాదం కాస్త హీట్ పెరిగి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులను తీసుకొస్తోంది. ఇక ఎన్నో రోజులుగా ఈ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏపీ హైకోర్టు మరోసారి మన్సాస్ ట్రస్ట్పై కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజతిరాజునే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక దీంతో పాటు సంచైత, ఊర్మిళ వేసిన పిటిషన్లను కోర్టు కొట్టి వేస్తూ ఈ నిర్ణయాన్ని తెలిపింది. ట్రస్టు డీడ్, ప్రాపర్టీ రిజిస్టర్ ప్రకారం ‘కుటుంబంలో పెద్దవారయిన పురుషులు’ వంశపారంపర్య ఛైర్మన్/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉండటం విశేషం. దీంతో అశోక్గజపతిరాజే ట్రస్టు ఛైర్మన్గా ఉండాలని ఆయన తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించటంతో కోర్టు గతంలో తీర్పును అశోక్గజపతిరాజుకు అనుకూలంగా వెలువరించింది.
ఇక అధికార వైసీపీ ప్రభుత్వం సంచైతను చైర్మన్గా నియమించేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలోనే అశోక్గజపతిరాజుకు సంచైత మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఇక గతంలో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, సింహాచలం దేవస్థానం ఛైర్మన్గా సంచైత నియామకం చెల్లదని హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో అశోక్ గజపతి రాజు స్పందిస్తూ రాజ్యాంగం, చట్టాలు ఇంకా బతికే ఉన్నాయని అన్నారు. తీర్పు అనంతరం చైర్మన్గా ప్రమాణస్వీకారం కూడా చేశాడు. కాగా ఈ క్రమంలో కోర్టు తాజాగా చైర్మన్గా అశోక్ గజపతి రాజు కొనసాగాలని ఆదేశాలు జారీ చేయటం విశేషం.